అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది. 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే, ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బంది కార్యాలయంలో చేసిన పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దురదృష్టకరమైన సంఘటనను మర్చిపోకుండా కుటుంబాలు ఇంకా బాధతో అలమటిస్తుండగా, కొంతమంది ఉద్యోగులు మ్యూజిక్, డాన్స్తో వేడుకల్లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
ఈ వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎయిరిండియాతో భాగస్వామిగా ఉన్న AISATS సంస్థ తీవ్రంగా స్పందించింది. సంస్థ విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ ప్రవర్తనను ఖండిస్తూ, నాలుగు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించింది. మిగతా సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ పార్టీ కార్యక్రమం గురుగ్రామ్లోని కార్యాలయంలో చోటుచేసుకున్నది. సీనియర్ ఉద్యోగులు కూడా డీజే పాటలపై స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు బయటకు వచ్చి విపరీతంగా పబ్లిసిటీ పొందాయి. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు ఇంకా తమ సభ్యుల దేహాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా ఆనందోత్సవాలు జరపడం అనేదే నెటిజన్లను ఉద్వేగానికి గురిచేసింది.
సింగపూర్కు చెందిన SATS లిమిటెడ్, ఎయిరిండియాతో కలిసి గ్రౌండ్ సర్వీసెస్ కోసం AISATS పేరుతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో ఇలా బాధాకరమైన ఘటన తర్వాత కాస్త బాధను పంచుకోవాల్సిన సమయంలో పార్టీలు నిర్వహించడాన్ని సహించలేనని నెటిజన్లు అంటున్నారు. “ఇదేనా బాధ్యత?” అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఘటనపై స్పందించిన సంస్థ, బాధిత కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
This post was last modified on June 28, 2025 5:33 pm
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…