అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది. 275 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే, ఎయిరిండియా గ్రౌండ్ సిబ్బంది కార్యాలయంలో చేసిన పార్టీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దురదృష్టకరమైన సంఘటనను మర్చిపోకుండా కుటుంబాలు ఇంకా బాధతో అలమటిస్తుండగా, కొంతమంది ఉద్యోగులు మ్యూజిక్, డాన్స్తో వేడుకల్లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
ఈ వివాదాస్పద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎయిరిండియాతో భాగస్వామిగా ఉన్న AISATS సంస్థ తీవ్రంగా స్పందించింది. సంస్థ విలువలకు విరుద్ధంగా జరిగిన ఈ ప్రవర్తనను ఖండిస్తూ, నాలుగు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించింది. మిగతా సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఈ పార్టీ కార్యక్రమం గురుగ్రామ్లోని కార్యాలయంలో చోటుచేసుకున్నది. సీనియర్ ఉద్యోగులు కూడా డీజే పాటలపై స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు బయటకు వచ్చి విపరీతంగా పబ్లిసిటీ పొందాయి. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు ఇంకా తమ సభ్యుల దేహాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా ఆనందోత్సవాలు జరపడం అనేదే నెటిజన్లను ఉద్వేగానికి గురిచేసింది.
సింగపూర్కు చెందిన SATS లిమిటెడ్, ఎయిరిండియాతో కలిసి గ్రౌండ్ సర్వీసెస్ కోసం AISATS పేరుతో దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో సేవలు అందిస్తోంది. అలాంటి సంస్థలో ఇలా బాధాకరమైన ఘటన తర్వాత కాస్త బాధను పంచుకోవాల్సిన సమయంలో పార్టీలు నిర్వహించడాన్ని సహించలేనని నెటిజన్లు అంటున్నారు. “ఇదేనా బాధ్యత?” అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఘటనపై స్పందించిన సంస్థ, బాధిత కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
This post was last modified on June 28, 2025 5:33 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…