“హాయ్, ఇది నేను టానర్.. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నేను ఇక మరణించానని..” అంటూ మొదలైన ఓ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను తాకుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టానర్ మార్టిన్ క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందే స్వయంగా ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసిన టానర్.. దాన్ని తన భార్య షేరైట్ బుధవారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
టానర్ జీవితంలోని చివరి సంవత్సరాల్లో తాను ఎలా ఉన్నాడో, క్యాన్సర్తో పోరాటం ఎలా సాగిందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకునే వాడు. కాల్ సెంటర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన అతను, క్యాన్సర్ సోకిన తర్వాత తాను పొందిన అనుభవాలను వీడియోలుగా మారుస్తూ లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
అతను రికార్డ్ చేసిన వీడియోలో కన్నీటి మాటలు వినిపించాయి. “ఇది భయంకరమైన ప్రయాణమే అయినా, కొత్త సాహసంగా భావిస్తున్నాను. ఆ మరణం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాను. జీవితం నాకు చాలా ఇచ్చింది. చివరినాళ్లలో మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. తన మరణాన్ని ముందు ఊహించి చెప్పే వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ అది కలిచివేసింది.
తన కుమార్తె ఎమీలౌ కోసం చివరిగా ఒక కోరికను టానర్ వ్యక్తం చేశాడు. ఆమె భవిష్య నిధి కోసం ఏర్పాటు చేసిన గోఫండ్మీ లింక్కి విరాళాలు ఇవ్వాలని కోరాడు. “ఒక మెక్చికెన్ ధరతో కూడా సహాయం చేయవచ్చు” అంటూ తన హాస్యాన్ని చివరి వరకు కొనసాగించాడు. టానర్ పోస్ట్ చేసిన చివరి వీడియోపై సోషల్ మీడియాలో వందలాది రెస్పాన్స్లు వస్తున్నాయి. అతని ధైర్యం, స్ఫూర్తిదాయక భావోద్వేగం నెటిజన్లను కదిలించింది. “చివరిసారిగా తన కుమార్తెను చూసినందుకు గర్వపడాలి.. నిజంగా గొప్ప వ్యక్తి” అని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.
This post was last modified on June 27, 2025 9:48 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…