“హాయ్, ఇది నేను టానర్.. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నేను ఇక మరణించానని..” అంటూ మొదలైన ఓ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను తాకుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టానర్ మార్టిన్ క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందే స్వయంగా ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసిన టానర్.. దాన్ని తన భార్య షేరైట్ బుధవారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
టానర్ జీవితంలోని చివరి సంవత్సరాల్లో తాను ఎలా ఉన్నాడో, క్యాన్సర్తో పోరాటం ఎలా సాగిందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకునే వాడు. కాల్ సెంటర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన అతను, క్యాన్సర్ సోకిన తర్వాత తాను పొందిన అనుభవాలను వీడియోలుగా మారుస్తూ లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
అతను రికార్డ్ చేసిన వీడియోలో కన్నీటి మాటలు వినిపించాయి. “ఇది భయంకరమైన ప్రయాణమే అయినా, కొత్త సాహసంగా భావిస్తున్నాను. ఆ మరణం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాను. జీవితం నాకు చాలా ఇచ్చింది. చివరినాళ్లలో మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. తన మరణాన్ని ముందు ఊహించి చెప్పే వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ అది కలిచివేసింది.
తన కుమార్తె ఎమీలౌ కోసం చివరిగా ఒక కోరికను టానర్ వ్యక్తం చేశాడు. ఆమె భవిష్య నిధి కోసం ఏర్పాటు చేసిన గోఫండ్మీ లింక్కి విరాళాలు ఇవ్వాలని కోరాడు. “ఒక మెక్చికెన్ ధరతో కూడా సహాయం చేయవచ్చు” అంటూ తన హాస్యాన్ని చివరి వరకు కొనసాగించాడు. టానర్ పోస్ట్ చేసిన చివరి వీడియోపై సోషల్ మీడియాలో వందలాది రెస్పాన్స్లు వస్తున్నాయి. అతని ధైర్యం, స్ఫూర్తిదాయక భావోద్వేగం నెటిజన్లను కదిలించింది. “చివరిసారిగా తన కుమార్తెను చూసినందుకు గర్వపడాలి.. నిజంగా గొప్ప వ్యక్తి” అని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.
This post was last modified on June 27, 2025 9:48 am
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…