“హాయ్, ఇది నేను టానర్.. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నేను ఇక మరణించానని..” అంటూ మొదలైన ఓ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను తాకుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టానర్ మార్టిన్ క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచాడు. మరణానికి ముందే స్వయంగా ఒక ఎమోషనల్ వీడియో రికార్డ్ చేసిన టానర్.. దాన్ని తన భార్య షేరైట్ బుధవారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
టానర్ జీవితంలోని చివరి సంవత్సరాల్లో తాను ఎలా ఉన్నాడో, క్యాన్సర్తో పోరాటం ఎలా సాగిందో సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకునే వాడు. కాల్ సెంటర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన అతను, క్యాన్సర్ సోకిన తర్వాత తాను పొందిన అనుభవాలను వీడియోలుగా మారుస్తూ లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
అతను రికార్డ్ చేసిన వీడియోలో కన్నీటి మాటలు వినిపించాయి. “ఇది భయంకరమైన ప్రయాణమే అయినా, కొత్త సాహసంగా భావిస్తున్నాను. ఆ మరణం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నాను. జీవితం నాకు చాలా ఇచ్చింది. చివరినాళ్లలో మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. తన మరణాన్ని ముందు ఊహించి చెప్పే వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ అది కలిచివేసింది.
తన కుమార్తె ఎమీలౌ కోసం చివరిగా ఒక కోరికను టానర్ వ్యక్తం చేశాడు. ఆమె భవిష్య నిధి కోసం ఏర్పాటు చేసిన గోఫండ్మీ లింక్కి విరాళాలు ఇవ్వాలని కోరాడు. “ఒక మెక్చికెన్ ధరతో కూడా సహాయం చేయవచ్చు” అంటూ తన హాస్యాన్ని చివరి వరకు కొనసాగించాడు. టానర్ పోస్ట్ చేసిన చివరి వీడియోపై సోషల్ మీడియాలో వందలాది రెస్పాన్స్లు వస్తున్నాయి. అతని ధైర్యం, స్ఫూర్తిదాయక భావోద్వేగం నెటిజన్లను కదిలించింది. “చివరిసారిగా తన కుమార్తెను చూసినందుకు గర్వపడాలి.. నిజంగా గొప్ప వ్యక్తి” అని పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.
This post was last modified on June 27, 2025 9:48 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…