Trends

అంతరిక్షం నుంచి లైవ్: శుభాంశు ఏమన్నాడంటే..

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా… అంతరిక్షంలో ఉన్న తన అనుభూతులను ప్రత్యక్షంగా లైవ్‌ కాల్‌ ద్వారా మొదటిసారి షేర్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరే ముందు తొలిసారిగా లైవ్ కాల్‌ ద్వారా మాట్లాడిన శుభాంశు, తన అనుభవాలను ఎంతో ఎమోషనల్‌గా, శ్రద్ధతో వివరించారు.

“ఇది అద్భుతమైన ప్రయాణం. నేను ఇప్పుడు భారరహిత స్థితికి అలవాటు పడటం కొత్త అనుభవం. ఓ చిన్నపిల్లాడిలా నడవడం, తినడం నేర్చుకుంటున్నా” అని శుభాంశు తన మాటల్లో చెప్పారు. ఆయన తాను ఒక్కడిననే అనిపించుకోలేదని, తన భుజంపై ఉన్న త్రివర్ణ పతాకం చూసినప్పుడు కోట్లాది భారతీయులు తన వెంట ఉన్నారనే భావన కలుగుతోందన్నారు. ఇది తనకు ఒక గొప్ప బలం ఇస్తోందని తెలిపారు.

అంతరిక్షానికి వెళ్లిన తర్వాత శుభాంశు మాట్లాడుతూ… ‘‘ఈ ప్రయాణానికి తోడుగా వచ్చిన జాయ్ అనే హంస బొమ్మను కూడా తీసుకొచ్చాం. భారతీయ సంస్కృతిలో హంస విజ్ఞానానికి చిహ్నం. ఇది మా మిషన్‌కు ఒక ప్రేరణలా ఉంటుంది,’’ అన్నారు. ఇక 30 రోజుల క్వారంటైన్ అనంతరం, అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం తన జీవితంలోని గొప్ప ఘట్టమన్నారు. ఈ ప్రయాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

41 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం తరఫున మరోసారి ఓ వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెడుతుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుభాంశు చేసిన లైవ్ కాల్ దేశమంతా గర్వపడేలా చేసింది. ISS చేరిన తర్వాత శుభాంశు సహా మిగిలిన ముగ్గురు వ్యోమగాములు 14 రోజుల పాటు ఉండి కీలక పరిశోధనల్లో పాల్గొననున్నారు.

This post was last modified on June 26, 2025 3:37 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Subhanshu

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

51 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

1 hour ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

3 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago