Trends

అంతరిక్షం నుంచి లైవ్: శుభాంశు ఏమన్నాడంటే..

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా… అంతరిక్షంలో ఉన్న తన అనుభూతులను ప్రత్యక్షంగా లైవ్‌ కాల్‌ ద్వారా మొదటిసారి షేర్ చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) చేరే ముందు తొలిసారిగా లైవ్ కాల్‌ ద్వారా మాట్లాడిన శుభాంశు, తన అనుభవాలను ఎంతో ఎమోషనల్‌గా, శ్రద్ధతో వివరించారు.

“ఇది అద్భుతమైన ప్రయాణం. నేను ఇప్పుడు భారరహిత స్థితికి అలవాటు పడటం కొత్త అనుభవం. ఓ చిన్నపిల్లాడిలా నడవడం, తినడం నేర్చుకుంటున్నా” అని శుభాంశు తన మాటల్లో చెప్పారు. ఆయన తాను ఒక్కడిననే అనిపించుకోలేదని, తన భుజంపై ఉన్న త్రివర్ణ పతాకం చూసినప్పుడు కోట్లాది భారతీయులు తన వెంట ఉన్నారనే భావన కలుగుతోందన్నారు. ఇది తనకు ఒక గొప్ప బలం ఇస్తోందని తెలిపారు.

అంతరిక్షానికి వెళ్లిన తర్వాత శుభాంశు మాట్లాడుతూ… ‘‘ఈ ప్రయాణానికి తోడుగా వచ్చిన జాయ్ అనే హంస బొమ్మను కూడా తీసుకొచ్చాం. భారతీయ సంస్కృతిలో హంస విజ్ఞానానికి చిహ్నం. ఇది మా మిషన్‌కు ఒక ప్రేరణలా ఉంటుంది,’’ అన్నారు. ఇక 30 రోజుల క్వారంటైన్ అనంతరం, అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం తన జీవితంలోని గొప్ప ఘట్టమన్నారు. ఈ ప్రయాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

41 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం తరఫున మరోసారి ఓ వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెడుతుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుభాంశు చేసిన లైవ్ కాల్ దేశమంతా గర్వపడేలా చేసింది. ISS చేరిన తర్వాత శుభాంశు సహా మిగిలిన ముగ్గురు వ్యోమగాములు 14 రోజుల పాటు ఉండి కీలక పరిశోధనల్లో పాల్గొననున్నారు.

This post was last modified on June 26, 2025 3:37 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Subhanshu

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago