Trends

జీడిమెట్లలో తల్లి హత్య.. కొత్త కోణం బయటికి

పిల్లల్ని చంపేసి ప్రియుడితో కలిసి లేచిపోయిన తల్లి.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. ప్రియుడి కోసం సొంత తల్లినే చంపేసిన కూతురు.. ఈ తరహా వార్తలు ఈ మధ్య తరచుగా వింటున్నాం. ఈ సమాజం ఎటు పోతోందో.. బంధాలు ఏమైపోతున్నాయో అని ఆందోళన రేకెత్తించే పరిణామాలివి. తాజాగా తెలంగాణలో గొప్ప పోరాట యోధురాలిగా పేరున్న చాకలి ఐలమ్మ ముని మనవరాలు.. తన కూతురి చేతిలోనే హత్యకు గురైన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

హైదరాబాద్‌లో కేవలం 16 ఏళ్ల వయసున్న కూతురు.. తన ప్రియుడు, అతడి తమ్ముడితో కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేయడం ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తన అక్కే తల్లిని చంపిందంటూ.. ఆ హత్య జరిగిన తీరును కూడా చెల్లెలు మీడియాకు  వివరించిన సంగతి తెలిసిందే. తన ప్రేమకు తల్లి ఒప్పుకోకపోవడం వల్లే ఆమె ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. మీడియాలో కూడా ఇదే రిపోర్ట్ అయింది.

ఐతే ఈ కేసును లోతుగా విచారించిన పోలీసులు కొత్త కోణాలను బయటికి తీశారు. బాలానగర్ డీఎస్పీ ఈ కేసు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. తల్లి వేధింపుల వల్లే కూతురు ఇలా చేసిందని ఆయన వెల్లడించడం గమనార్హం. నిందితురాలు అంజలికి సొంత కూతురు కాదట. తన భర్త మొదటి భార్యకు పుట్టిన అమ్మాయి అట. తన సొంత కూతురిని మాత్రం బాగా చూసుకుంటూ.. సవతి కూతురిని అంజలి నిర్లక్ష్యం చేసిందట. 

తనను సవతి తల్లి చిత్ర హింసలు పెడుతోందన్న కారణంతో 7వ తరగతిలోనే బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసి కొన్ని రోజుల పాటు హోంలో ఉందట. ఇక వర్తమానంలోకి వస్తే శివ అనే అబ్బాయితో బాలిక ప్రేమ గురించి తెలిసిన అంజలి ముందు సరే అందట. అబ్బాయి, అమ్మాయి కొన్ని రోజులు వీళ్లింట్లోనే ఉంటూ సహజీవనం చేశారట. కానీ తర్వాత శివ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, బాలికను వేధించడంతో ఇద్దరూ కలిసి ఆమె హత్యకు ప్రణాళిక రచించారని.. శివ తమ్ముడు కూడా ఇందులో భాగం అయ్యారని.. ముగ్గురూ కలిసి ఆమెను హత్య చేశారని డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.

Kumar

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

26 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago