Trends

హైదరాబాద్‌లోని ఆలయానికి అంబానీ భారీ విరాళం

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నుండి భారీ విరాళం అందింది. కోటి రూపాయల మొత్తాన్ని ఆమె ఆలయ అభివృద్ధి కోసం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అయిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ కలిసి బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలను దర్శించారు. ఆలయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ ఈఓగా ఉన్న కృష్ణ ఆలయ విశిష్టతను వివరించి, అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందనగా ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేయడం జరిగింది.

ప్రస్తుతం ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్ గౌడ్ ప్రకారం, ఈ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో నిల్వ చేయనున్నారు. దానిపై వచ్చే వడ్డీని ఉపయోగించి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు. ఇది భక్తులకు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి హాజరవుతారు. ముఖ్యంగా బోనాల జాతర సమయంలో ఆలయం భక్తుల తాకిడి తో కళకళలాడుతుంది. ఇలాంటి ఆలయ అభివృద్ధికి కార్పొరేట్ స్థాయిలో వస్తున్న సహకారం అభినందనీయం. నీతా అంబానీ విరాళంతో ఇతర ప్రముఖులు కూడా ముందుకు వచ్చే అవకాశముందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

This post was last modified on June 20, 2025 1:54 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

6 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

6 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

7 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

8 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

8 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

8 hours ago