హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నుండి భారీ విరాళం అందింది. కోటి రూపాయల మొత్తాన్ని ఆమె ఆలయ అభివృద్ధి కోసం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అయిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ కలిసి బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలను దర్శించారు. ఆలయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ ఈఓగా ఉన్న కృష్ణ ఆలయ విశిష్టతను వివరించి, అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందనగా ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేయడం జరిగింది.
ప్రస్తుతం ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్ గౌడ్ ప్రకారం, ఈ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో నిల్వ చేయనున్నారు. దానిపై వచ్చే వడ్డీని ఉపయోగించి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు. ఇది భక్తులకు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి హాజరవుతారు. ముఖ్యంగా బోనాల జాతర సమయంలో ఆలయం భక్తుల తాకిడి తో కళకళలాడుతుంది. ఇలాంటి ఆలయ అభివృద్ధికి కార్పొరేట్ స్థాయిలో వస్తున్న సహకారం అభినందనీయం. నీతా అంబానీ విరాళంతో ఇతర ప్రముఖులు కూడా ముందుకు వచ్చే అవకాశముందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on June 20, 2025 1:54 pm
ఒక్కోసారి అమీర్ ఖాన్ ఏదేదో స్టేట్ మెంట్లు ఇచ్చేసి గందరగోళంలో పడేస్తారు. కొన్ని పనులు కూడా అలాగే అనిపించినా వాటి…
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతులు…
ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…