హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నుండి భారీ విరాళం అందింది. కోటి రూపాయల మొత్తాన్ని ఆమె ఆలయ అభివృద్ధి కోసం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ అధికారిక బ్యాంక్ ఖాతాలో జమ అయిందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని చూసి భక్తులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ కలిసి బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలను దర్శించారు. ఆలయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ ఈఓగా ఉన్న కృష్ణ ఆలయ విశిష్టతను వివరించి, అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందనగా ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేయడం జరిగింది.
ప్రస్తుతం ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్ గౌడ్ ప్రకారం, ఈ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో నిల్వ చేయనున్నారు. దానిపై వచ్చే వడ్డీని ఉపయోగించి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు తెలిపారు. ఇది భక్తులకు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఎంతో సహాయపడుతుందన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి హాజరవుతారు. ముఖ్యంగా బోనాల జాతర సమయంలో ఆలయం భక్తుల తాకిడి తో కళకళలాడుతుంది. ఇలాంటి ఆలయ అభివృద్ధికి కార్పొరేట్ స్థాయిలో వస్తున్న సహకారం అభినందనీయం. నీతా అంబానీ విరాళంతో ఇతర ప్రముఖులు కూడా ముందుకు వచ్చే అవకాశముందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.
This post was last modified on June 20, 2025 1:54 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…