ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. రాబోయే రెండు వారాల్లోగా ఇరాన్పై సైనిక చర్య చేపట్టాలా వద్దా అన్న అంశంపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా, అవసరమైతే బలాన్ని ఉపయోగించడానికీ వెనుకాడబోనని కూడా స్పష్టం చేశారు.
ఈ ప్రకటనకు ఓ రోజు ముందు ట్రంప్ తుది ఆదేశాలివ్వలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా ఇప్పటికీ ఇరాన్ అణు ప్రాజెక్టుపై అనుమానంతో ఉంది. ట్రంప్ ఆశయం – అణ్వాయుధ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడమేనని లెవిట్ స్పష్టం చేశారు. దీనికోసం కఠిన షరతులతో ఒప్పందం కుదిరే అవకాశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ కొన్ని అణు స్థావరాలపై దాడులు జరపగా, టెహ్రాన్ వెంటనే కౌంటర్ దాడులకు దిగింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసిన ఘటనలో బీర్షెబాలోని ఓ ఆసుపత్రి ధ్వంసమైంది. దక్షిణ ఇజ్రాయెల్లోని సోరోకా వైద్య కేంద్రం పై జరిగిన దాడి నేపధ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరస్పర దాడులు ఆ ప్రాంతంలో అశాంతి ముదిరినదీ ఖాయం చేశాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన కథనం ప్రకారం, ట్రంప్ ఇరాన్ అణు ప్రోగ్రామ్ ఆగిపోయిందో లేదో పసిగట్టే వరకు తన తదుపరి చర్యను వెల్లడించరని అంచనా. అయితే, “నేను చేయవచ్చు, చేయకపోవచ్చు. వచ్చే వారం లేదా అంతకన్నా త్వరలో స్పష్టత ఇస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఇరాన్ పై సైనిక దాడి చేపట్టాలనే అంచనాలు ఊపందుకుంటున్నా, అమెరికా ఇంకా చివరి నిర్ణయం తీసుకోలేదు. కానీ చర్చల కిటికీ ఓపెన్ గానే ఉన్నప్పటికీ, శాంతి లేకపోతే బల ప్రదర్శన తప్పదని ట్రంప్ వైఖరి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో అమెరికా తీసుకునే నిర్ణయం ప్రపంచ శాంతికి గమ్యం ఏవైపు అనేదానిపై ప్రభావం చూపనుంది.
This post was last modified on June 20, 2025 8:59 am
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…