ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. రాబోయే రెండు వారాల్లోగా ఇరాన్పై సైనిక చర్య చేపట్టాలా వద్దా అన్న అంశంపై తుది నిర్ణయం వెల్లడించనున్నట్టు ట్రంప్ పేర్కొన్నట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా, అవసరమైతే బలాన్ని ఉపయోగించడానికీ వెనుకాడబోనని కూడా స్పష్టం చేశారు.
ఈ ప్రకటనకు ఓ రోజు ముందు ట్రంప్ తుది ఆదేశాలివ్వలేదన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా ఇప్పటికీ ఇరాన్ అణు ప్రాజెక్టుపై అనుమానంతో ఉంది. ట్రంప్ ఆశయం – అణ్వాయుధ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడమేనని లెవిట్ స్పష్టం చేశారు. దీనికోసం కఠిన షరతులతో ఒప్పందం కుదిరే అవకాశాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ కొన్ని అణు స్థావరాలపై దాడులు జరపగా, టెహ్రాన్ వెంటనే కౌంటర్ దాడులకు దిగింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసిన ఘటనలో బీర్షెబాలోని ఓ ఆసుపత్రి ధ్వంసమైంది. దక్షిణ ఇజ్రాయెల్లోని సోరోకా వైద్య కేంద్రం పై జరిగిన దాడి నేపధ్యంలో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరస్పర దాడులు ఆ ప్రాంతంలో అశాంతి ముదిరినదీ ఖాయం చేశాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించిన కథనం ప్రకారం, ట్రంప్ ఇరాన్ అణు ప్రోగ్రామ్ ఆగిపోయిందో లేదో పసిగట్టే వరకు తన తదుపరి చర్యను వెల్లడించరని అంచనా. అయితే, “నేను చేయవచ్చు, చేయకపోవచ్చు. వచ్చే వారం లేదా అంతకన్నా త్వరలో స్పష్టత ఇస్తాను” అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఇరాన్ పై సైనిక దాడి చేపట్టాలనే అంచనాలు ఊపందుకుంటున్నా, అమెరికా ఇంకా చివరి నిర్ణయం తీసుకోలేదు. కానీ చర్చల కిటికీ ఓపెన్ గానే ఉన్నప్పటికీ, శాంతి లేకపోతే బల ప్రదర్శన తప్పదని ట్రంప్ వైఖరి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో అమెరికా తీసుకునే నిర్ణయం ప్రపంచ శాంతికి గమ్యం ఏవైపు అనేదానిపై ప్రభావం చూపనుంది.
This post was last modified on June 20, 2025 8:59 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…