Trends

రోహిత్ వారసుడు అతనే.. కానీ

భారత టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు గత కొన్ని రోజులుగా అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మీడియాలో ఉన్న ప్రచారాన్నే నిజం చేస్తూ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కొత్త సారథిగా ప్రకటించింది బీసీసీఐ. కొన్నేళ్లుగా జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తన స్థానంలో ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంచుకుంటారా.. లేక కొత్త సారథిని ప్రకటిస్తారా అనే చర్చ జరిగింది.

ఐతే బుమ్రా తరచూ గాయాల పాలవుతుండడంతో అతణ్ని వైస్ కెప్టెన్‌గా కూడా పక్కన పెట్టి శుభ్‌మన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. కెప్టెన్సీ విషయంలో పెద్దగా సర్ప్రైజ్‌ ఏమీ లేనట్లే. కానీ జట్టులో మాత్రం కొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. వన్డేల్లో అదరగొడుతూ, ఐపీఎల్‌లో కూడా పంజాబ్ జట్టును గొప్పగా నడిపిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అనుభవం ఉంది, ఫామ్ కూడా సూపర్. రంజీల్లోనూ రాణించాడు. ఐపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు. అయినా శ్రేయస్‌కు టెస్టు జట్టులో చోటు దక్కపోవడం ఆశ్చర్యకరం.

శ్రేయస్‌తో పాటు మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో చెన్నై జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్‌కు దేశవాళీల్లో మంచి రికార్డుంది. అయినా అతణ్ని కాదని అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో చోటిచ్చారు. ఇక అనుకున్నట్లే తమిళనాడు కుర్రాడు, ఐపీఎల్‌లో గుజరాత్ తరఫున అదరగొడుతున్న సాయి సుదర్శన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సరైన ఫాంలో లేకపోయినా.. టెస్టు జట్టులో చోటు నిలుపుకున్నాడు.

This post was last modified on May 24, 2025 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago