Trends

పెంచిన జీతాలు తిరిగిచ్చేయలట

ఉద్యోగంలో జీతం పెరిగిన అనంతరం దాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చే అనుభవం ఇప్పటివరకు ఎవరికి ఎదురై ఉండదు. కానీ ఇటీవల అలాంటి ఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్‌ఎయిర్ ఓ విచిత్ర నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు లోనైంది. ఇటీవల తన సిబ్బందికి జీతాలు పెంచిన ఈ సంస్థ.. ఇప్పుడు అదే పెంపును తిరిగి చెల్లించమంటూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.8 లక్షల వరకు పెరిగిన మొత్తాన్ని కంపెనీ ఖాతాలో తిరిగి జమ చేయాలని కోరింది. లేదంటే మెల్లగా జీతాల నుంచి కోత వేస్తామని హెచ్చరించింది.

ఈ వివాదానికి మూలకారణం.. రయన్‌ఎయిర్, కార్మిక సంఘాల మధ్య ఏర్పడిన ఒప్పందమే. రయన్‌ఎయిర్‌కి చెందిన రెండు ప్రధాన కార్మిక సంఘాల్లో ఒకటైన ‘సీసీఓఓ’తో సంస్థ జీతాల పెంపు ఒప్పందం చేసుకుంది. దీనినుసరించి ఉద్యోగుల వేతనాలను పెంచింది. అయితే, దీనిపై మరో కార్మిక సంఘం ‘యూఎస్ఓ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది.

విచారణ జరిపిన కోర్టు.. సీసీఓఓతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని తేల్చింది. ఈ తీర్పును ఆధారంగా చేసుకొని సంస్థ తాము ఇచ్చిన జీతాల పెంపును రద్దు చేస్తూ, ఉద్యోగులకు మళ్లీ ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు పంపించింది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేతనాలపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక.. తిరిగి తీసుకోవడం తగదని మండిపడుతున్నారు.

యూఎస్ఓ ప్రతినిధి ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్ మాట్లాడుతూ.. తమ సభ్యులపై ఒత్తిడి తెస్తూ సీసీఓఓలో చేరాలంటూ కంపెనీ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. వేతనాల పెంపు చెల్లదన్న కోర్టు తీర్పును సవాలు చేస్తామని చెప్పారు. ఇది ఉద్యోగుల హక్కులకు వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, రయన్‌ఎయిర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. “మేము కోర్టు తీర్పును పాటిస్తున్నాము. యూఎస్ఓదే కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు వారి కోరిన తీర్పు వచ్చినందున, మేము చర్యలు తీసుకుంటున్నాము” అని తెలిపారు. ఈ పరిణామం విమానయాన రంగంలో వేడి చర్చకు దారితీసింది.

This post was last modified on May 24, 2025 3:17 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

38 minutes ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

41 minutes ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

4 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

6 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

6 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

7 hours ago