Trends

రోహిత్, విరాట్ రిటైర్మెంట్‌.. ఎట్టకేలకు గంభీర్ క్లారిటీ!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెంటవెంటనే టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వడం క్రికెట్ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరూ ఒక్కసారిగా టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పడంతో బీసీసీఐ వర్గాలు కూడా ఆశ్చర్యపోయినట్లు సమాచారం. వీరిని హోల్డ్ చేయడానికి బోర్డు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని వార్తలు వచ్చాయి. మరికొందరైతే రోహిత్, విరాట్ బీసీసీఐ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని కూడా ప్రచారం చేశారు. 

గంభీర్ ప్రధాన కోచ్ అయ్యాక వారిపై ఒత్తిడి పెరిగిందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు స్పందించారు. “ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ కావాలనుకుంటాడో, ఆ నిర్ణయం పూర్తిగా అతనిది. ఎవరు రిటైర్ అవ్వాలని చెప్పరు.. నాకు, సెలక్టర్లుకు లేదా బీసీసీఐకి అలా చెప్పే అర్హత లేదు. అది వ్యక్తిగత నిర్ణయం. ఆ హక్కును గౌరవించాలి,” అని గంభీర్ స్పష్టం చేశారు. తన దృష్టిలో రిటైర్మెంట్ నిర్ణయానికి గౌరవమే తప్ప విమర్శల అవసరం లేదన్నారు.

విరాట్, రోహిత్ లాంటి సీనియర్ ఆటగాళ్లు దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బే అయినా, యువ ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం అని గంభీర్ అభిప్రాయపడ్డారు. “ఇలాంటి సందర్భాల్లోనే కొత్త ఆటగాళ్లు జట్టు బాధ్యతను తీసుకుంటారు. తక్కువ అనుభవంతోనూ గొప్ప విజయాలు సాధించే బలాన్ని మనం ముందు చూపించాలి,” అని తెలిపారు. గతంలో బుమ్రా లేకుండానే భారత జట్టు ట్రోఫీ గెలుచుకున్న విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, శనివారం బీసీసీఐ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించనుంది. ఈ సందర్భంగా నూతన టెస్ట్ కెప్టెన్‌ను కూడా ప్రకటించనున్నారు. మీడియా సమావేశంలో గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ప్రెస్ మీట్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

This post was last modified on May 23, 2025 10:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

38 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

46 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago