ఇకపై రక్త పరీక్ష చేయించుకోవాలంటే చేతికి సూది పొడవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇప్పుడు అది వాస్తవం. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు రూపుదిద్దిన కొత్త టెక్నాలజీ “అమృత్ స్వస్థ్ భారత్” టూల్తో ఇది సాధ్యమవుతోంది. ఇది పూర్తిగా కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే హెల్త్ స్కానింగ్ పరికరం. ఇది మన ముఖాన్ని స్కాన్ చేసి, కొన్ని క్షణాల్లోనే బ్లడ్ టెస్ట్ తో పాటు పలు ఆరోగ్య వివరాలను అందిస్తుంది.
ఈ టూల్లో వినియోగిస్తున్న ప్రధాన సాంకేతికత పేరు ఫోటోప్లీతిస్మోగ్రఫీ (PPG). దీని ద్వారా ఓ ప్రత్యేకమైన కాంతిని మన ముఖం మీద ప్రసరింపజేస్తారు. ఈ కాంతి మన శరీరంలోని రక్తప్రసరణ, ఆక్సిజన్ పరిమాణం వంటి కీలక అంశాలను గుర్తించగలదు. తేలికపాటి స్కానింగ్తోనే హార్ట్ రేట్, హీమోగ్లోబిన్, స్ట్రెస్ లెవెల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్ వంటి ప్యారామీటర్లను గుర్తించడంలో ఇది సులభంగా పనిచేస్తుంది.
ప్రస్తుతం అమృత్ స్వస్థ్ భారత్ టూల్తో ఒక వ్యక్తి ఆరోగ్య పరీక్ష కేవలం 20 నుంచి 60 సెకన్లలో పూర్తవుతుంది. ఇందులో రక్తం బిందువును కూడా తీసే అవసరం ఉండదు. ఇదంతా ఫేస్ స్కానింగ్తోనే జరుగుతుంది. దీని వలన పిల్లలు, వృద్ధులు, బలహీన శరీరులైన వారికీ అధిక ప్రయోజనం ఉంటుంది.
ఈ టూల్ను రూపొందించిన నీలోఫర్ వైద్య బృందం గర్వంగా చెబుతోంది “ఇది సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేసే పరికరం. ఊపిరితిత్తుల రోగులు, గర్భిణులు, పిల్లలు వంటి వారికీ అవసరమైన పరీక్షలు వేగంగా చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే వందలాది మందికి ప్రయోజనం కలుగుతుంది” అని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మెడికల్ సేవల రూపాన్ని పూర్తిగా మార్చే అవకాశముందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. టెక్నాలజీ మన ఆరోగ్య సంరక్షణలో ఈ స్థాయిలో అడుగులు వేయడం గొప్ప పరిణామం అని వారు చెబుతున్నారు.
This post was last modified on May 23, 2025 10:28 pm
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…