ధర్మాన బ్రదర్స్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీలో ఇదే చర్చ సాగుతోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఒకరు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. కానీ.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. ధర్మాన బ్రదర్స్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వారి వాయిస్ కూడా వినిపించడం లేదు. ధర్మాన కృష్ణదాస్.. అసలు పార్టీ నుంచే కాకుండా.. రాజకీయాల నుంచి కూడా తప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు కంటే కూడా.. కృష్ణదాస్కు వైఎస్ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది. ఈయన వైఎస్ మరణం నుంచే ఆ కుటుంబానికి అండగా ఉన్నారు.ఈ క్రమంలోనే పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లకు మారిన మంత్రి వర్గంలో ధర్మాన కుటుంబానికి ప్రాధాన్యం తగ్గించకుండా.. ప్రసాదరావుకు జగన్ మంత్రి పీఠం ఇచ్చారు. ఇది సంచలనమేనని అప్పట్లో చర్చ సాగింది.
ఇలా.. ధర్మాన కుటుంబానికి జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. వారిద్దరు సోదరులు కూడా.. పార్టీ అధికారం పోయిన తర్వాత.. ఎక్కడివారు అక్కడే మౌనంగా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాలకు కూడా చేరువ కాలేక పోతున్నారు. పైగా.. ఎక్కడా వారి వాయిస్ కూడా వినిపించడం లేదు. ఇది పార్టీలోనే కాదు.. రాజకీయంగా కూడా ధర్మాన సోదరుల చుట్టూ వివాదంగా మారింది. పార్టీ అధికారంలో ఉంటే పదవులు అనుభవించి.. తాజాగా ఇలా చేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు.. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్న విషయం తెలిసిందే. దీనికి వారు భయపడుతున్నారా? అనేది ప్రశ్న. తమ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీస్తే.. అప్పుడు తాము కూడా జైళ్లకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా? అనేది ప్రశ్న. అయితే.. దీనిపైనా వారు స్పందించడం లేదు. ముఖ్యంగా ప్రసాదరావుకు మేధావి వర్గల్లో మంచి పేరుంది. ఆయన బయటకు వస్తే.. పార్టీకి ఒకింత ఉపశమనం దక్కతుందన్న చర్చ కూడా ఉంది. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on May 23, 2025 6:47 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…