Political News

ఆ భ‌వ‌నం తెలంగాణ‌కే: ఆస్తుల అప్ప‌గింత‌లో ఏపీ కీల‌క నిర్ణ‌యం!

2014నాటి ‘ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం’ ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఆస్తుల పంప‌కాలు జ‌ర‌గాల్సి ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్‌లో నిర్మించిన ప‌లు భ‌వ‌నాల్లో ఏపీకి కూడా వాటాలు ఉన్నాయి. వీటిని చ‌ట్టంలోనే పేర్కొన్నారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ప‌దేళ్లు దాటిపోయినా.. రాజ‌కీయ ప‌ర‌మైన వివాదాల కార‌ణంగా ఆయా ఆస్తుల పంప‌కాల విషయంలో వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికీ.. నీటి వివాదాలు కొన‌సాగుతున్నట్టే.. ఆస్తుల వివాదాలు కూడా అలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కీల‌క ఆస్తి విష‌యంలో ముంద‌డుగు ప‌డింది.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో్ని ఎర్రమంజిల్‌లో ఉన్న పౌరసరఫరాలశాఖ భవన్‌లో తెలంగాణ, ఏపీ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ ఆస్తుల పంప‌కానికి సంబంధించి.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇచ్చిపుచ్చుకునే అంశాల‌కు సంబంధించి భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో 25 వేల చద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఉమ్మ‌డి ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌ భవన్‌ను పూర్తిగా తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ త‌ర‌ఫున మంత్రి నాదెండ్ల అంగీక‌రించారు. అయితే.. దీనికి ప్ర‌తిగా తెలంగాణ టెక్నాల‌జీ సాయం త‌మ‌కు అందిస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

వాస్త‌వానికి ఆస్తుల విభ‌జ‌న ప్ర‌కారం.. 25 వేల చద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఉమ్మ‌డి ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాల‌ భవన్‌లో స‌గం వాటా ఏపీకి చెందుతుంది. దీనిపై గ‌తంలోనే ఏకాభిప్రాయానికి రావాల‌ని ఇరు రాష్ట్రాలు ప్ర‌య‌త్నించాయి. కానీ.. ముంద‌డుగు ప‌డ‌లేదు. దీనిని త‌మ‌కు ఇచ్చేయాల‌ని కేసీఆర్ హ‌యాంలోనే డిమాండ్ వినిపించింది. ‘ఎక్క‌డి ఆస్తులు అక్క‌డికే చెందుతాయి’ అని అప్ప‌ట్లో సీఎం కేసీఆర్ వాద‌న తెర‌మీదికి తెచ్చారు. దీనిపై ఏపీ అప్ప‌ట్లో ఒప్పుకోలేదు. ఇక‌, అప్ప‌టి నుంచి వివాదంగానే ఉన్న ఈ విష‌యంలో తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుని స‌ద‌రు భ‌వ‌నాన్ని పూర్తిగా తెలంగాణ‌కే అప్ప‌గించేలా ఒప్పందం చేసుకున్నారు.

ఇక‌, ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణుల‌కు కూడా శ్రీకారం చుట్టారు. ఏపీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యం అందించే కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వం త‌క్కువ ధ‌ర‌ల‌కే బియ్యాన్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు అంగీక‌రించింది. ఇక‌, తెలంగాణ బియ్యాన్ని కాకినాడ పోర్టునుంచి ర‌వాణా చేసుకునేందుకు ఏపీ అనుమ‌తులు ఇస్తుంది. అదేవిధంగా రెండు రాష్ట్రాల రైతుల‌కు ఉప‌యోగ ప‌డేలా బియ్యం.. ఇత‌ర పంట‌ల విష‌యంలోనూ ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటాయి. ఈ మేర‌కు ఇరువురు మంత్రులు కూడా మీడియాకుప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.

This post was last modified on May 24, 2025 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

43 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago