Suicide
ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల మానసిక స్థితిగతులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకే భయపడటం, అవమానానికి తట్టుకోలేకపోవడం.. ఇలా చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితికి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న విషాదకర ఘటన ఇదే విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోంది.
పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని గోసాయిబేర్ బజార్ ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే బాలుడు చిప్స్ ప్యాకెట్ తీసుకుపోయాడన్న నెపంతో ఓ దుకాణదారుడు తీవ్రంగా అవమానించాడు. అందరి మధ్యలో చెంపదెబ్బలు కొట్టి, గుంజీలు తీయించాడు. ఈ ఘటనపై తన తల్లిని కూడా ఆకస్మికంగా చూసిన బాలుడు, ఆమె నుంచి కూడా తిట్లు తిని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
తనపై వచ్చిన దొంగ ఆరోపణలు తట్టుకోలేని క్రిషెందు, ఇంటికి వెళ్లి గదిలోకి మౌనంగా వెళ్లిపోయాడు. తలుపులు వేసుకొని పురుగుల మందు తాగాడు. కొన్ని గంటల తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టగా.. అపస్మారక స్థితిలో పడిపోయిన క్రిషెందు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని పక్కనే ఉన్న ఆత్మహత్య లేఖ చదివిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నేను దొంగను కాదు.. అమ్మా నన్ను క్షమించు..’’ అని చిన్నారి రాసిన వాక్యాలు చదవగానే చుట్టుపక్కలవారికి కన్నీళ్లతో కళ్లు చెదిరిపోయాయి. పోలీసుల దర్యాప్తుతో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్పై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాధిత బాలుడికి న్యాయం జరగాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 23, 2025 10:24 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…