Suicide
ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల మానసిక స్థితిగతులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకే భయపడటం, అవమానానికి తట్టుకోలేకపోవడం.. ఇలా చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితికి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న విషాదకర ఘటన ఇదే విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోంది.
పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని గోసాయిబేర్ బజార్ ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే బాలుడు చిప్స్ ప్యాకెట్ తీసుకుపోయాడన్న నెపంతో ఓ దుకాణదారుడు తీవ్రంగా అవమానించాడు. అందరి మధ్యలో చెంపదెబ్బలు కొట్టి, గుంజీలు తీయించాడు. ఈ ఘటనపై తన తల్లిని కూడా ఆకస్మికంగా చూసిన బాలుడు, ఆమె నుంచి కూడా తిట్లు తిని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
తనపై వచ్చిన దొంగ ఆరోపణలు తట్టుకోలేని క్రిషెందు, ఇంటికి వెళ్లి గదిలోకి మౌనంగా వెళ్లిపోయాడు. తలుపులు వేసుకొని పురుగుల మందు తాగాడు. కొన్ని గంటల తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టగా.. అపస్మారక స్థితిలో పడిపోయిన క్రిషెందు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని పక్కనే ఉన్న ఆత్మహత్య లేఖ చదివిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నేను దొంగను కాదు.. అమ్మా నన్ను క్షమించు..’’ అని చిన్నారి రాసిన వాక్యాలు చదవగానే చుట్టుపక్కలవారికి కన్నీళ్లతో కళ్లు చెదిరిపోయాయి. పోలీసుల దర్యాప్తుతో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్పై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాధిత బాలుడికి న్యాయం జరగాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 23, 2025 10:24 pm
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…