Suicide
ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల మానసిక స్థితిగతులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకే భయపడటం, అవమానానికి తట్టుకోలేకపోవడం.. ఇలా చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితికి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న విషాదకర ఘటన ఇదే విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోంది.
పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని గోసాయిబేర్ బజార్ ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే బాలుడు చిప్స్ ప్యాకెట్ తీసుకుపోయాడన్న నెపంతో ఓ దుకాణదారుడు తీవ్రంగా అవమానించాడు. అందరి మధ్యలో చెంపదెబ్బలు కొట్టి, గుంజీలు తీయించాడు. ఈ ఘటనపై తన తల్లిని కూడా ఆకస్మికంగా చూసిన బాలుడు, ఆమె నుంచి కూడా తిట్లు తిని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
తనపై వచ్చిన దొంగ ఆరోపణలు తట్టుకోలేని క్రిషెందు, ఇంటికి వెళ్లి గదిలోకి మౌనంగా వెళ్లిపోయాడు. తలుపులు వేసుకొని పురుగుల మందు తాగాడు. కొన్ని గంటల తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టగా.. అపస్మారక స్థితిలో పడిపోయిన క్రిషెందు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని పక్కనే ఉన్న ఆత్మహత్య లేఖ చదివిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నేను దొంగను కాదు.. అమ్మా నన్ను క్షమించు..’’ అని చిన్నారి రాసిన వాక్యాలు చదవగానే చుట్టుపక్కలవారికి కన్నీళ్లతో కళ్లు చెదిరిపోయాయి. పోలీసుల దర్యాప్తుతో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్పై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాధిత బాలుడికి న్యాయం జరగాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 23, 2025 10:24 pm
కొన్ని జ్ఞాపకాలు చాలా చేదుగా అనిపిస్తాయి. వద్దన్నా గుర్తు చేసుకునే సందర్భాలు పలకరిస్తాయి. సరిగ్గా ఇదే రోజు 2003 ఏప్రిల్…
వారణాసి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్…
ఈ వారం తెలుగులో చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్లు లేవు. కానీ థియేటర్లలో సందడి కనిపిస్తోంది. అలా అని ముందు వారాల్లో…
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్…
కేవీఎన్ ప్రొడక్షన్స్.. భారతీయ సినీ రంగంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ. తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చివరి…
ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన…