Trends

AIని డెవలప్ చేస్తే.. చివరికి దాని వల్లే మోసపోయారు!

ఈ మధ్యకాలంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత సాధారణమైపోయింది. ప్రత్యేకంగా అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ దిగ్గజాలు తమ నైపుణ్యాన్ని గల సిబ్బందికే ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇందులో మూడింట ఒక వంతు మంది కేవలం ఏఐ టెక్నాలజీపై పనిచేసే వారే కావడం గమనార్హం.

ఇంతకీ సమస్య ఎక్కడిదంటే, సంస్థ భవిష్యత్తు కోసం రూపొందించిన కృత్రిమ మేధ వ్యవస్థలే ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. అమెరికా వాషింగ్టన్ కార్యాలయంలో తొలగించిన ఉద్యోగుల్లో 40 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా, వీరిలో చాలామంది గతంలో సంస్థే సూచించినట్లుగా ఏఐ టూల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినవారే. ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లను కోడింగ్‌కు ఉపయోగించమన్న అధికారి సూచనలనే వారు అమలు చేశారు. అదే ఇప్పుడు వారి ఉద్యోగాలకు అడ్డు అయ్యిందన్నది వాస్తవం.

జూనియర్ కోడర్స్‌, టెక్నికల్ మేనేజర్స్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తున్నవారికి ఈ సారి అధికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. స్టార్టప్‌లలో పని చేస్తున్న ఏఐ డైరెక్టర్లకు కూడా ఈ కోత తగలడమే కాకుండా, సొంతంగా ఏఐ టూల్స్ అభివృద్ధికి తోడ్పడిన వారికీ ఉద్వాసన పలకడం అందరిలో ఆవేదన రేకెత్తిస్తోంది.

ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ ఒక ప్రతినిధి స్పందిస్తూ, సంస్థ నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు మార్పులు అవసరమయ్యాయని తెలిపారు. కోత అనివార్యమని, టెక్నాలజీలో ముందంజ వేయాలంటే కొంత త్యాగం తప్పదని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా సంస్థ 10 వేల మందిని తొలగించింది. ఇప్పుడు ఇది రెండో అతిపెద్ద తొలగింపు.

సత్యనాదెళ్ల ఇటీవలే 30 శాతం కోడింగ్‌ను ఏఐతోనే చేస్తామని చెప్పిన మాటలు నిజమవుతున్నాయనిపిస్తోంది. కానీ అదే టెక్నాలజీ ఉద్యోగులను తొలగించడానికి కారణమవుతోంది. ఇదే టెక్ రంగ భవిష్యత్తా..? అనేది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారుతోంది.

This post was last modified on May 23, 2025 10:21 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

31 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

51 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago