Trends

అత్యాచారం కేసులో బేయిల్.. హీరోల తరహాలో ర్యాలీ!

కర్ణాటకలో తాజాగా చోటుచేసుకున్న ఒక దుర్మార్గపు సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు యువకులు బెయిల్‌పై విడుదలైన వెంటనే వీరుల్లా ఊరేగింపులో పాల్గొనడం కలకలం రేపుతోంది. హవేరి సబ్ జైలు నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు, సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కి ఆళూరు పట్టణం వరకు కొనసాగింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలలో, ఏడుగురు నిందితులు ఐదు కార్లతో కూడిన కాన్వాయ్‌లో ఊరేగింపుగా తిరుగుతూ, అభిమానుల మద్దతుతో నడుస్తూ కనిపించారు. వీరిని స్థానికులే కాకుండా కొందరు నాయకులు కూడా స్వాగతించినట్లు తెలుస్తోంది. ఇది న్యాయవ్యవస్థను అవమానించడమే కాకుండా బాధితురాలికి తీవ్ర అవమానం కలిగించిందని మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసు జనవరి 2024లో చోటుచేసుకుంది. హవేరి జిల్లాలో ఓ యువతిని మోసం చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఘటన లాడ్జి సమీపంలో వదిలేసినట్లు బాధితురాలు ఆరోపించింది. పోలీసుల దర్యాప్తులో నిందితులపై పలు చార్జీలు నమోదు కాగా, వారిలో కొందరు గతంలోనూ మానసిక వేధింపులు, మోరల్ పోలీసింగ్ కేసుల్లో ఉన్నట్లు సమాచారం.

తాజాగా బాధితురాలు కోర్టులో నిందితులను సరిగా గుర్తించలేకపోవడం వల్ల న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. ఇక అదునుగా ఆనందంగా మార్చుకుని, దురాశయంతో ఊరేగింపుగా ప్రదర్శించుకోవడం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ ఊరేగింపు వీడియోలపై పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసే అవకాశముంది.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

51 minutes ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

1 hour ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

1 hour ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

2 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago