Trends

ప్రాణాలకు తెగించారు గానీ… ఫలితం లేకుండా పోయింది

హైదరాబాద్ లోని పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఆ తర్వాత వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఓ మసీదు ఉండగా.. ఉదయాన్నే ప్రార్థనల కోసం వచ్చిన ఐదుగురు ముస్తిం యువకులు మంటలను చూసి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రంగంలోకి దూకారు గానీ…అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ యువకుల సాహసం వృథాగా మారిపోయింది. ఇక బాధిత కుటుంబాలకు చెందిన మరో వ్యక్తి తన బంధువులను కాపాడి తాను మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గుల్జార్ హౌస్ సమీపంలోని మసీదులో ఉదయమే ప్రార్థనలు ముగించుకున్న గాజుల వ్యాపారి మీర్ జాహెద్, మహ్మద్ అమేర్, మహ్మద్ ఇబ్రహీంలతో పాటు మరో ఇద్దరు అక్కడికి సమీపంలోని ఓ టీ కొట్టు వద్ద టీ తాగుతున్నారు. అదే సమయంలో అక్కడికి సమీపంలోని ఓ భవనంలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించారు. ఏమైందో చూద్దామని అటుగా వెళ్లగా…పొగలు వస్తున్న భవనంలో నుంచి ఇద్దరు మహిళలు తమను కాపాడాలంటూ కేకలు వేశారు. ఆ ఆర్తనాదాలు విన్నంతనే ఐదుగురు యువకులు ముందూ వెనుకా చూడలేదు. నేరుగా ఆ భవనంలోకి దూకేశారు. అప్పటికే పొగతో నిండిపోయిన ఆ భవనం గ్రిల్స్ ను పగలగొట్టి లోపలికి ప్రవేశింంచారు.

అయితే ఆ గ్రిల్స్ లోపల ఓ వ్యక్తి అప్పటికే విగత జీవిగా కనిపించాడు. ఇంకాస్త ముందుకెళితే…ఓ మహిళ తన పిల్లలను ఒడిలో పెట్టుకుని ప్రాణాలు విడిచి కనిపించింది. అంతటి భయానక దృశ్యాలను చూసి కూడా ఆ యువకులు వెనక్కు తగ్గలేదు. తమకు కనిపించిన వారినంతా వారు బయటకు తీసుకువచ్చారు. అలా వారు మొత్తం 13 మందిని మంటల్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే వారంతా అప్పటికే చనిపోయారట. నిండా పొగలతో అలముకున్న ఆ భవంంతిలోకి ముఖానికి గుడ్డలు కట్టుకుని వెళ్లిన ఆ యువకులు కనిపించిన వారినంతా కాపాడే ప్రయత్నం చేశారు గానీ… వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆక్సిజనో, లేదంటో ఇంకేదో లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంటో వారికి అందుబాటులో ఉంటే వారు కొందరి ప్రాణాలు అయినా కాపాడేవారే.

ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో చనిపోయిన ఇంటి పెద్ద ప్రహ్లాద్ మోదీ సోదరుడి కుమారుడు అబిషేక్ మోదీ నిజంగానే వీర మరణం పొందాడని చెప్పాలి. తమ బంధువులను మంటల నుంచి కాపాడేందుకు అబిషేక్ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన అభిషేక్… తనకు సమీపంలోని బంధువులతో కలిసి మంటల నుంచి బయట పడ్డాడు. అయితే మరింత మంది తమ బంధువులు మంటల్లో చిక్కుకున్నారని బావించి తిరిగి లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో తన సోదరి పిల్లలు ఇద్దరితో పాటు మరో బంధువును బయటకు పంపాడు. ఈ క్రమంలో ఆయన మాత్రం మంటలకు ఆహుతి అయ్యాడు.

Kumar

Recent Posts

వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!

ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…

2 hours ago

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

2 hours ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

3 hours ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

5 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

6 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

6 hours ago