భాగ్యనగరి హైదరాబాద్ పరిధిలోని పాతబస్తీలో సెలవు దినం ఆదివారం ఘోరం జరిగింది. పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన గుల్జార్ హౌస్ లో ఆదివారం ఉదయం ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ ఉన్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.
బహుళ అంతస్తుల భవనంగా ఉన్న గుల్జార్ హౌస్ లో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆదివారం ఉన్నట్టుండి హౌస్ లోని తొలి అంతస్తులో ఏసీ కంప్రెజర్ పేలి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఈ మంటలు ఇతర అంతస్తులకూ విస్తరించాయి. మంటలు చెలరేగిందే తొలి అంతస్తు కావడంతో పై అంతస్తుల్లోని వారు వేగంగా బయటకు రాలేకపోయారు. ఈ కారణంగానే ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అప్పటికే మంటల్లో చిక్కుబడిపోయిన వారిలో ముగ్గురు చనిపోగా… వీలయినంత ఎక్కువ మందిని మంటల నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స మొదలుపెట్టేలోగానే మరో 14 మంది చనిపోయారు. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 17 మంది చనిపోయినట్టు అయ్యింది.
ఇక ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీపంలోని ఉస్మానియా, యశోద, డీఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదంలో ఏకంగా 8 మంది సజీవ దహనం కావడంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేదన్న ఆయన… ఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ప్రదాని నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
This post was last modified on May 18, 2025 12:14 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…