పాక్కు చెందిన జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు దేశీయ ఈ-కామర్స్ వేదికలపై విక్రయానికి చేరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు దేశ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన సమయంలో, ఇలా వివాదాస్పద వస్తువులకు చోటివ్వడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిత్యం చురుగ్గా పనిచేస్తున్న సీసీపీఏ ఈ అంశంపై నోటీసులు జారీ చేసి, తక్షణమే అలాంటి ఉత్పత్తులను తొలగించాలంటూ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ వేదికగా స్పందించారు. “ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, జాతీయ గౌరవాన్ని దెబ్బతీసే తీరుగా చూస్తున్నాం. దేశ చట్టాల ప్రకారం ఇటువంటి కంటెంట్ను తక్షణమే తొలగించాలి” అని హెచ్చరించారు. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, యూబై ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ సంస్థలకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు.
ఇక మరోవైపు, సీఏఐటీ నేతలు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి లేఖ రాస్తూ ఎత్తిచూపారు. “మన సైన్యం ఆపరేషన్ సిందూర్లో పాక్ మద్దతుదారులపై ఉక్కుపాదం మోస్తున్న సమయంలో, దేశ వ్యాపార వేదికలపై పాకిస్థాన్ జెండాలు అమ్మకానికి పెట్టడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది” అని పేర్కొన్నారు. ఇది కేవలం పొరపాటు కాదు, దేశ భద్రత, ప్రజల ఐక్యతపై ముప్పుగా భావించాలన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు సంబంధిత ఈ-కామర్స్ సంస్థలు తక్షణమే స్పందిస్తాయా? లేదా అనే విషయం మీద ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
This post was last modified on May 17, 2025 4:14 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…