Trends

IPL 2025 న్యూ రూల్.. ఇక ఎవరినైనా తెచ్చుకోండి!

ఐపీఎల్ 2025లో కీలక మార్పుతో బీసీసీఐ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 17 నుంచి మళ్లీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ విడుదలైంది. టోర్నమెంట్ ముగింపు తేదీ మే 25 నుండి జూన్ 3కి మారింది. ఈ మార్పుల వల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్లు టోర్నీని విడిచి వెళ్తున్నారు. దీంతో జట్లకు ఆటగాళ్ల రీప్లేస్‌మెంట్ అవసరమైంది.

ఇందుకు అనుగుణంగా బీసీసీఐ ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఏ జట్టు అయినా తాత్కాలిక ఆటగాళ్లను తీసుకోవచ్చని ఆదేశించింది. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతేనే రీప్లేస్‌మెంట్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు జట్టు వద్దకు రాకపోయిన విదేశీ ఆటగాళ్ల స్థానంలోనూ కొత్త ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఆ ఆటగాళ్లు ఎవరైనా కావచ్చు, లోకల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా కావచ్చు.

అయితే బీసీసీఐ ఈ తాత్కాలిక ప్లేయర్లపై ఓ స్పష్టతనూ ఇచ్చింది. ఇప్పుడు తీసుకునే ప్లేయర్లను వచ్చే ఏడాది జట్లు రిటైన్ చేసుకోలేవు. అంటే వాళ్లు 2026 ఐపీఎల్ వేలానికి తప్పకుండా రావాల్సిందే. జట్టు కోణంలో ఇది తాత్కాలికంగా ఉపయోగపడే మార్పే అయినప్పటికీ, రాబోయే సీజన్ వ్యూహాలకు మాత్రం ఎటువంటి అనుసంధానం ఉండదు. ఇక ఇప్పటికే టోర్నీ నిలిపివేతకు ముందు తీసుకున్న రీప్లేస్‌మెంట్లను మాత్రం రిటైన్ చేసుకోవచ్చు.

ఈ కొత్త రూల్‌తో జట్లకు చివరి దశలో తమ బలాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం లభించింది. డిల్లీ క్యాపిటల్స్‌లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, చెన్నైలో జేమీ ఓవర్టన్ వంటి ఆటగాళ్లు టోర్నీని వదిలి వెళ్లిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవచ్చు. కానీ 2026 కోసం మళ్లీ వేలంలో పోటీ పడాలి. దీని వల్ల కొత్త అవకాశాలు లభిస్తే.. ఇక వచ్చే ఏడాది వాటిని కోల్పోతారు. ఫ్రాంచైజీలకు ఇది స్వల్ప ఊరటే అయినా, అభిమానులకు మాత్రం కొత్త ఫేస్‌లను చూసే అవకాశం. మధ్యలో వచ్చిన బ్రేక్‌కి ఇలా ఓ చక్కటి పరిష్కారం తీసుకొచ్చిన బీసీసీఐని ట్రేడ్ వర్గాలు అభినందిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయన్నది మాత్రం ఖాయం.

This post was last modified on May 15, 2025 12:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: IPL 2025

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

1 hour ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago