భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 2025ను వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 57 మ్యాచ్ లు జరిగిన తరువాత సగంలో ఆపేయడం అనేది మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒక్క ప్రశ్నే మెదులుతోంది.. టోర్నమెంట్ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు ఎంత నష్టం జరుగుతుంది. ఆటగాళ్ల వేతనం పరిస్థితి ఏమిటి అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ అసలు నిజం ఏంటంటే, ఐపీఎల్ రద్దు అయినా ఎవరికీ నష్టం జరగదు.
దీనికి వెనక పెద్ద కారణం బీసీసీఐ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు. బీసీసీఐ ప్రతి సీజన్కు బీమా పొందుతూ ఉంటుంది. మనం సాధారణంగా కార్లు, బైక్లు, మొబైల్స్, ఆరోగ్యానికి బీమా తీసుకునే విధంగా, ఐపీఎల్ లీగ్కి కూడా పెద్ద స్థాయిలో బీమా తీస్తారు. ఈ పాలసీ ద్వారా ఏదైనా మ్యాచ్ రద్దయినా, లేదా టోర్నమెంట్ నిలిచిపోయినా వచ్చే నష్టం బీమా కంపెనీలు భర్తీ చేస్తాయి.
ఇది మాత్రమే కాదు, ప్రతి జట్టు తమ ఆటగాళ్లకు కూడా బీమా పొందుతుంది. అంటే, ఏ ఆటగాడు గాయపడ్డా, లేదా అనుకోని పరిస్థితులు ఎదురైనా అతని చికిత్స ఖర్చు మొత్తాన్ని బీమా కవర చేస్తుంది. ఫలితంగా ఫ్రాంచైజీలు ఎటువంటి ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక రకంగా జట్లను సేఫ్ జోన్లో ఉంచే ప్లాన్.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే, మ్యాచ్లు రద్దయితే స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల ప్రకారం బీసీసీఐకు పరిహారం అందుతుంది. అంటే, మ్యాచ్లు ఆగిపోవడం వల్ల ప్రత్యక్ష ఆదాయం తగ్గినా, బీమా వల్ల వచ్చే పరిహారంతో ఆ లోటును పూరించుకోవచ్చు. ఇక్కడ కూడా బీసీసీఐ చురుకైన ప్లానింగ్ కనిపిస్తుంది. ఇక పరిస్థితి చక్కబడితే కొత్త షెడ్యూల్తో మళ్లీ ఐపీఎల్ తిరిగి వచ్చేస్తుంది.
This post was last modified on May 10, 2025 10:12 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…