ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. అయితే, ఏడు జట్లు ఇంకా టాప్-4 కోసం పోరాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం ఫేవరెట్గా కనిపిస్తోంది.
RCB 11 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. రజత్ పటిదార్ నాయకత్వంలో ఈ జట్టు ఇంకొక్క విజయంతోనే ప్లేఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకోవచ్చు. ఒకవేళ మరో రెండు మ్యాచ్లు గెలిచినట్లయితే, టాప్-2లో స్థానం సునాయాసం. ఆర్సీబీ ఫామ్, నెట్ రన్ రేట్ ఈ జట్టుకు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీబీ అభిమానులు ప్లేఆఫ్స్ ఆశలతో సంబరపడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ (PBKS) కూడా బలమైన పోటీలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్పై ఇటీవలి విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 11 మ్యాచ్ల్లో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పీబీకేఎస్, మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఒక్క విజయంతోనూ అవకాశం ఉంది, కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) కూడా రేసులో బలంగా ఉన్నాయి. MI 11 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో ఆరు వరుస విజయాలతో ఊపు మీద ఉంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రెండు విజయాలు సాధిస్తే టాప్-4 ఖాయం. GT 10 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో ఉంది. శుభ్మన్ గిల్ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రేసులో కొంచెం వెనుకబడి ఉంది. 11 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో ఉన్న LSG, మిగిలిన మూడు మ్యాచ్లూ గెలవాల్సి ఉంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు ఉంటాయి, కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. డెల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా రేసులో ఉన్నాయి, కానీ వాటికి అవకాశాలు చాలా తక్కువ. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలవడమే కాదు, మిగతా టాప్ జట్లు వరుసగా ఓటమి చెందాలి. కానీ అది అంత ఈజీ కాదు. ఏదేమైనా ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నిజంగా ఉత్కంఠగా సాగుతోంది!
This post was last modified on May 6, 2025 8:55 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…