ఐపీఎల్ లో మొదటి నుంచి ఫోకస్ అవుతున్న రాజస్థాన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ముంబైతో జరిగిన మ్యాచ్ ఊహించని షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు కేవలం రెండో బంతికే డకౌట్ కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పైగా మ్యాచ్కి ముందు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ చేసిన అంచనాలే నిజమవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఐపీఎల్ ను చాలా అద్భుతంగా ఆరంభించిన వైభవ్, గుజరాత్పై సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ ముంబై బౌలర్లు ముందుగానే పథకం వేసి బౌన్స్ బంతులతో అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు. దీపక్ చాహర్ వేసిన రెండో బంతికి చెత్త షాట్ ఆడి మిడాన్ ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. యువ ఆటగాడి పై బౌలర్లు ప్రత్యేక వ్యూహాలతో వస్తారని గవాస్కర్ ఇదివరకే హెచ్చరించిన మాటలు హైలెట్ అవుతున్నాయి.
సునీల్ గవాస్కర్ ఇటీవల రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్ టైటాన్స్పై అద్భుత శతకం సాధించిన తర్వాత, ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ రెండో బంతికే డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో గవాస్కర్ చేసిన సూచనలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గవాస్కర్ మాట్లాడుతూ, “వైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా యూత్ టెస్ట్లో శతకం సాధించాడు. అతడిలో ప్రతిభ ఉంది, కానీ ఇంకా పూర్తిగా రాటుదేలలేదు. రాహుల్ ద్రవిడ్ వంటి మెంటర్ల మార్గదర్శకత్వంలో అతడు తన ఆటను మెరుగుపరచాలి” అని పేర్కొన్నారు.
అలాగే, “తొలి మ్యాచ్లో మొదటి బంతికే సిక్స్ కొట్టడం, మూడో మ్యాచ్లో శతకం సాధించడం చూసి అతడిని అధికంగా పొగడకూడదు. ఇది అతడిపై ఒత్తిడిని పెంచుతుంది. అనుభవజ్ఞులైన బౌలర్లు అతడిని తేలికగా అంచనా వేయరు. అతడు ప్రతి మ్యాచ్లో మొదటి బంతికే సిక్స్ కొట్టాలని భావిస్తే, అది అతడికి ఇబ్బందిగా మారుతుంది” అని గవాస్కర్ హెచ్చరించారు. గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు, వైభవ్ ముంబైతో మ్యాచ్లో రెండో బంతికే డకౌట్ అయిన తర్వాత మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో అభిమానులు గవాస్కర్ సూచనలు ఎంత నిజమయ్యాయో చర్చిస్తున్నారు.
This post was last modified on May 2, 2025 3:48 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…