Trends

ఏపీలో సంచలనం రేపుతున్న ‘చర్చి’ మరణం

ఈ రోజుల్లో కూడా పిల్లలు అనారోగ్యం పాలైతే మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి తాయిత్తులు కట్టించడం.. చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించడం లాంటివి చేసే జనాలు తక్కువేమీ కాదు. ఇక గాలి సోకిందని, దయ్యం పట్టిందని చేయించే పూజలు పునస్కారాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి సందర్భాల్లో జనాల్లోని అమాయకత్వాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే కేటుగాళ్లకు కొదవ లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమై పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ఇంతలో ఆ బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్యహత్మకు పాల్పడడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఓ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలిక రెండు రోజుల కిందట విశాఖలోని జ్ఞానాపురం చర్చిలో బలిపీటం దగ్గర మృతి చెందింది. ఆ చిన్నారికి గాలి సోకిందని చర్చికి తీసుకొచ్చారు తల్లి, అమ్మమ్మ. ఐతే బాలిక చనిపోయిన సమయంలో ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల వద్దకు చేరింది. బాలిక తల్లి, అమ్మమ్మను వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో మీడియా వాళ్లు అసలేం జరిగిందంటూ ఆ ఇద్దరినీ ప్రశ్నించే ప్రయత్నం చేయగా నోరు విప్పలేదు.

ఒక రోజు గడిచిందో లేదో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ స్వల్పంగా నీళ్లున్న ఒక బావిలో విగతజీవులై కనిపించారు. పోలీసుల విచారణకు భయపడి బాలిక తల్లి, ఆమె అమ్మమ్మ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. చర్చిలో ఏదో అనుమానాస్పదంగా జరిగి ఉంటుందని.. అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని కొందరు అంటుంటే.. బాలికను అదుపు చేయడంలో భాగంగా నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టారని.. ఈ క్రమంలో ఊపిరాడక ఆ బాలిక ప్రాణాలు విడిచిందని కొందరు అంటున్నారు. ఐతే ఈ మాత్రానికే బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

This post was last modified on April 29, 2025 6:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago