Trends

ఏపీలో సంచలనం రేపుతున్న ‘చర్చి’ మరణం

ఈ రోజుల్లో కూడా పిల్లలు అనారోగ్యం పాలైతే మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి తాయిత్తులు కట్టించడం.. చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించడం లాంటివి చేసే జనాలు తక్కువేమీ కాదు. ఇక గాలి సోకిందని, దయ్యం పట్టిందని చేయించే పూజలు పునస్కారాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి సందర్భాల్లో జనాల్లోని అమాయకత్వాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే కేటుగాళ్లకు కొదవ లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమై పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ఇంతలో ఆ బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్యహత్మకు పాల్పడడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఓ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలిక రెండు రోజుల కిందట విశాఖలోని జ్ఞానాపురం చర్చిలో బలిపీటం దగ్గర మృతి చెందింది. ఆ చిన్నారికి గాలి సోకిందని చర్చికి తీసుకొచ్చారు తల్లి, అమ్మమ్మ. ఐతే బాలిక చనిపోయిన సమయంలో ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల వద్దకు చేరింది. బాలిక తల్లి, అమ్మమ్మను వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో మీడియా వాళ్లు అసలేం జరిగిందంటూ ఆ ఇద్దరినీ ప్రశ్నించే ప్రయత్నం చేయగా నోరు విప్పలేదు.

ఒక రోజు గడిచిందో లేదో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ స్వల్పంగా నీళ్లున్న ఒక బావిలో విగతజీవులై కనిపించారు. పోలీసుల విచారణకు భయపడి బాలిక తల్లి, ఆమె అమ్మమ్మ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. చర్చిలో ఏదో అనుమానాస్పదంగా జరిగి ఉంటుందని.. అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని కొందరు అంటుంటే.. బాలికను అదుపు చేయడంలో భాగంగా నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టారని.. ఈ క్రమంలో ఊపిరాడక ఆ బాలిక ప్రాణాలు విడిచిందని కొందరు అంటున్నారు. ఐతే ఈ మాత్రానికే బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

This post was last modified on April 29, 2025 6:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago