Trends

ఐపీఎల్ ఫైనల్.. ఈ రెండు జట్లపైనే అందరి ఫోకస్

ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుతున్న వేళ, ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. అయితే అత్యద్భుత ఫామ్‌లో ఉన్న రెండు జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ముంబై ఇండియన్స్ ఫైనల్లో తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండూ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, అభిమానుల కల నిజమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఆర్‌సీబీ టేబుల్ టాపర్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో అగ్రస్థానం దక్కించుకుంది. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య వంటి ఆటగాళ్ల ఫామ్ ఆ జట్టుకు బలంగా నిలుస్తోంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిస్తే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్‌ను ఖాయం చేసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సన్‌రైజర్స్, సీఎస్‌కే, లక్నో, కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లపై అభిమానుల ఆసక్తి ఎక్కువగా ఉంది.

ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, ప్రారంభంలో నష్టపోయినా ఇప్పుడు బలంగా పుంజుకుంది. వరుసగా ఐదు విజయాలతో మూడో స్థానానికి ఎగబాకింది. జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రావడం ముంబై బలాన్ని పెంచింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ టికెట్ ఖాయం. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్‌లపై విజయాలపై ముంబై ఆశలు పెట్టుకుంది.

ఈ పరిస్థితుల్లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఫైనల్ వరకు చేరితే మాత్రం ఈసారి ఐపీఎల్ మరింత కిక్కిచ్చే అవకాశం ఉంది. ఒకవైపు చరిత్రలో ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ దక్కించుకోలేని ఆర్‌సీబీ, మరోవైపు ఐదు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్. ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రస్తుత ఫామ్, పాయింట్స్ టేబుల్ పరిస్థితిని బట్టి చూస్తే, ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌తో పాటు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేరే అవకాశాలు ఎక్కువ. పంజాబ్ కింగ్స్‌కు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక లక్నో, కేకేఆర్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ కు రావడం అంత ఈజీ కాదు. రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. మొత్తం మీద, అభిమానులు కోరుకున్న ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఫైనల్ జరుగుతుందా? లేక ఇంకెవరైనా ట్విస్ట్ ఇస్తారా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజుల వేచి చూడాల్సిందే.

This post was last modified on April 28, 2025 5:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago