ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని షాక్ ఇచ్చింది. ముల్లాన్పూర్ వేదికగా KKR తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ విజయం ఒక్క మ్యాచ్ కాదు, ఒక రీబౌండ్, గత మ్యాచులో 245 పరుగుల స్కోరు కూడా కాపాడలేకపోయిన జట్టు ఇప్పుడు అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం విశేషం.
మొదట్లోనే పంజాబ్ బ్యాటింగ్లో తడబడింది. తక్కువ ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. కేవలం ప్రభ్సిమ్రాన్ సింగ్ (30), ప్రియాంశ్ ఆర్య (22) మాత్రమే పోరాడారు. కానీ కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా, నరైన్, చక్రవర్తి అత్యద్భుతంగా రాణించడంతో పంజాబ్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అప్పటిదాకా చూస్తే, విజయం సాధించటం చాలా అసంభవంగా కనిపించింది. కానీ మలుపు అక్కడే మొదలైంది.
పంజాబ్ బౌలింగ్లో జాన్సన్, చాహల్, అర్షదీప్ లాంటి బౌలర్లు అద్భుతంగా ఆడారు. చాహల్ 4 వికెట్లు తీసి తన మేజిక్ స్పెల్తో మళ్లీ ఒరిజినల్ ఫామ్ చూపించి కీలకమైన వికెట్లు తీసాడు. రాహనే కూల్గా మ్యాచ్ హ్యాండ్షేక్కి వచ్చినా, అతడు రివ్యూ తీసుకోకపోవడం ఆ దశలో టర్నింగ్ పాయింట్ అయ్యింది. రఘువంశీ (37) ఒక స్థిరత చూపినా, మిగతా బ్యాటర్లంతా కట్టుబడకపోవడంతో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది.
111 పరుగులు టార్గెట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తారనికుంటే KKR ఊహించని విధంగా బోల్తా పడింది. పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. మార్కో జాన్సన్ (3/17), చాహల్ (4/28) మేజిక్ చూపించగా, మ్యాక్స్వెల్, అర్షదీప్ కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఆఖర్లో రస్సెల్ ఒక్క ఓవర్లో 16 పరుగులు కొట్టినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో కేకేఆర్ ఆశలు గాలిలో కలిసిపోయాయి.
ఈ విజయం పంజాబ్కు ఒక గేమ్ మాత్రమే కాదు, మానసికంగా తిరిగి లేచే బలాన్నిచ్చింది. తక్కువ స్కోరులో కూడా టీ20 మ్యాచులు ఎంత థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మ్యాచ్ నిరూపించింది. అట్టడుగు నుంచి పైకి రావడం ఎలా ఉండాలో ఈ గేమ్ చూపించింది. T20 క్రికెట్లో మాయాజాలానికి స్కోరు అవసరం లేదు.. సమయానికి చురుకైన వ్యూహం ఉంటే చాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
This post was last modified on April 16, 2025 6:48 am
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…