ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి స్పేస్ టూర్లో పాల్గొన్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించిన ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అయితే ఈ షార్ట్ స్పేస్ రైడ్ అనుభవించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కేటీ పెర్రీతో పాటు ఈ అంతరిక్ష ప్రయాణంలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్, టీవీ వ్యాఖ్యాత గేల్ కింగ్, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషా బోవీ, శాస్త్రవేత్త అమండా గుయెన్, నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ ఉన్నారు. వీరందరూ బ్లూ ఆరిజిన్ సంస్థ పంపించిన స్పేస్ క్యాప్సూల్లో ప్రయాణించి భూమి అంచు వరకు వెళ్లి వచ్చారు. ఇది సాధారణంగా ‘అంతరిక్షపు అంచు’గా పరిగణిస్తారు.
ఈ ప్రయాణం కోసం సాధారణంగా టికెట్ ధర ఎంతనేది బ్లూ ఆరిజిన్ అధికారికంగా చెప్పదు. కానీ, ఒకరిని రిజర్వ్ చేయాలంటే ముందుగానే సుమారు రూ.1.25 కోట్లు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 2021లో తొలి స్పేస్ టూర్కి జరిగిన వేలంలో ఒక్క సీటు రూ.240 కోట్లకు అమ్ముడైందని రిపోర్టులు చెప్పాయి.
అయితే అందరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బ్లూ ఆరిజిన్ కొన్ని ప్రముఖులను ‘గౌరవ అతిథులు’గా ఉచితంగా తీసుకెళుతోంది. తాజా ప్రయాణంలో కూడా కొంతమంది డబ్బు చెల్లించగా, మరికొందరికి ఉచిత ప్రయాణం కల్పించినట్లు సమాచారం. అయితే ఎవరు చెల్లించారు, ఎవరు ఉచితంగా వెళ్లారన్న విషయాన్ని బ్లూ ఆరిజిన్ గోప్యంగా ఉంచింది. మొత్తంగా ఇలా ఒక తార అంతరిక్షం చేరడం అభిమానులకు ప్రత్యేక అనుభూతినే ఇచ్చింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…
పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…