Trends

అంతరిక్షంలో ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి స్పేస్ టూర్‌లో పాల్గొన్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించిన ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అయితే ఈ షార్ట్ స్పేస్ రైడ్ అనుభవించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కేటీ పెర్రీతో పాటు ఈ అంతరిక్ష ప్రయాణంలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్, టీవీ వ్యాఖ్యాత గేల్ కింగ్, మాజీ నాసా శాస్త్రవేత్త ఐషా బోవీ, శాస్త్రవేత్త అమండా గుయెన్, నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ ఉన్నారు. వీరందరూ బ్లూ ఆరిజిన్ సంస్థ పంపించిన స్పేస్ క్యాప్సూల్‌లో ప్రయాణించి భూమి అంచు వరకు వెళ్లి వచ్చారు. ఇది సాధారణంగా ‘అంతరిక్షపు అంచు’గా పరిగణిస్తారు.

ఈ ప్రయాణం కోసం సాధారణంగా టికెట్ ధర ఎంతనేది బ్లూ ఆరిజిన్ అధికారికంగా చెప్పదు. కానీ, ఒకరిని రిజర్వ్ చేయాలంటే ముందుగానే సుమారు రూ.1.25 కోట్లు డిపాజిట్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 2021లో తొలి స్పేస్ టూర్‌కి జరిగిన వేలంలో ఒక్క సీటు రూ.240 కోట్లకు అమ్ముడైందని రిపోర్టులు చెప్పాయి.

అయితే అందరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బ్లూ ఆరిజిన్ కొన్ని ప్రముఖులను ‘గౌరవ అతిథులు’గా ఉచితంగా తీసుకెళుతోంది. తాజా ప్రయాణంలో కూడా కొంతమంది డబ్బు చెల్లించగా, మరికొందరికి ఉచిత ప్రయాణం కల్పించినట్లు సమాచారం. అయితే ఎవరు చెల్లించారు, ఎవరు ఉచితంగా వెళ్లారన్న విషయాన్ని బ్లూ ఆరిజిన్ గోప్యంగా ఉంచింది. మొత్తంగా ఇలా ఒక తార అంతరిక్షం చేరడం అభిమానులకు ప్రత్యేక అనుభూతినే ఇచ్చింది.

This post was last modified on April 15, 2025 9:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago