నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినా కూడా అధికార యంత్రాగం మొద్దు నిద్ర వీడటం లేదు. జనం ప్రాణాలు హరిస్తున్న ఈ భాణ సంచా తయారీపై ఓ సురక్షితమైన పాలసీ రూపొందిద్దామన్న కనీస యావ ప్రభుత్వాలకూ రావడం లేదు. వెరసి నిత్య ఈ తరహా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఏపీలో జరిగిన ఈ తరహా ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడగా… మరో ఐదుగురు గాయడపడ్డారు.
ఏపీలోని ఉత్తరాంధ్రలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల బాణసంచా తయారీకి ప్రసిద్ధి. మండల పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సామర్లకోటకు చెందిన కార్మికులు పనిచేస్తుండగా… వారిలో ఓ నలుగురు చనిపోగా… ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ పేలుడు ఎంత తీవ్రంగా జరిగిందంటే.. పేలుడు ధాటికి సదరు కర్మాగారం నామరూపాల్లేకుండా ఎగిరిపోయింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదం సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్ధం పరిసర ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అంతేకాకుండా ఈ పేలుడు ధాటికి సదరు కర్మాగారం పరిసరాల్లోని పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. సాధారణంగా తమిళనాడులోని శివకాశిలో బాణసంచా పేలుడు ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటూ ఉంటాయి. కాలక్రమంలో దేశంలోని ఇతర ప్రాంతాకూ బాణసంచా తయారీ కేంద్రాలు విస్తరించగా… ఇప్పుడు ఈ తరహా ప్రమాదాలు ఇతర ప్రాంతాల్లోనూ నిత్యకృత్యం అయిపోయాయి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…