అమెరికాలోని శాస్త్రవేత్తలు చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయాన్ని తిరిగి రాశారు. ఐస్ ఏజ్లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో గర్జించిన ‘డైర్ వుఫ్స్’కు సంబంధించిన జీనెటిక్స్ను తిరిగి సృష్టించడంలో ఘన విజయాన్ని సాధించారు. కోలస్సల్ బయోసైన్సెస్ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధకులు జీన్లు సవరించి, మూడు డైర్ వుఫ్లలాంటి నక్క పిల్లలను అభివృద్ధి చేశారు. వీటి వయస్సు మూడు నుండి ఆరు నెలల మధ్య ఉండగా, ప్రస్తుతం అమెరికాలో ఓ సురక్షిత ప్రాంతంలో వీటిని పెంచుతున్నారు.
ప్రాచీన డీఎన్ఏ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ నక్కలు, అసలైన డైర్ వుఫ్లతో పోలిస్తే ఆకారంలో భారీగా ఉండే జాతిని పోలి ఉండటం ఆశ్చర్యకరం. శాస్త్రవేత్తలు ఓహియోలో లభ్యమైన 13,000 ఏళ్ల పురాతన పళ్లూ, ఐడహోలో లభించిన 72,000 ఏళ్ల పూర్వపు కపాలాన్ని విశ్లేషించి డైర్ వుఫ్ జన్యుగత లక్షణాలను గుర్తించారు. అనంతరం క్రిస్పర్ టెక్నాలజీ సహాయంతో గ్రే వుఫ్ జాతికి చెందిన రక్త కణాలను 20 చోట్ల మార్పులు చేసి, వాటిని పెంపుడు కుక్కల గర్భాశయంలోకి వదిలారు. ఇక 62 రోజుల గర్భధారణ అనంతరం ఈ నక్క పిల్లలు జన్మించాయి.
అయితే వీటి ప్రవర్తన మాత్రం అసలైన డైర్ వుఫ్స్ మాదిరిగా ఉండబోదని కోలస్సల్ సంస్థ జంతు సంరక్షణ నిపుణుడు మ్యాట్ జేమ్స్ తెలిపారు. “వీటికి పెద్ద ఎల్క్ను ఎలా వేటాడాలో, చివరికి ఎలా చంపాలో తెలియదు. ఇది తల్లిదండ్రుల నుండి వచ్చే ప్రవర్తనా బోధనే కాకుండా, వారి అనుభవానికి దగ్గరగా కూడ కాకపోవచ్చు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
సైన్స్లో ఈ ప్రయోగం ఎంతైనా గొప్పదే అయినా, ఇది పూర్తిగా ఒక జాతిని తిరిగి తీసుకొచ్చిందని చెప్పడం కష్టమేనని ఇండిపెండెంట్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. “ఇప్పుడు చేయగలిగేది కేవలం ఒక జాతిని పోలిన ఆకారాన్ని తయారు చేయడమే,” అని యూనివర్సిటీ ఆఫ్ బఫలోకి చెందిన జీవ శాస్త్రవేత్త విన్సెంట్ లించ్ అన్నారు. కోలస్సల్ సంస్థ గతంలో వూల్లీ మమ్మత్స్, డోడో పక్షులు వంటి అంతరించిపోయిన జాతులను తిరిగి తీసుకొచ్చే ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. తాజాగా, అమెరికాలో అత్యంత అరుదైన రెడ్ వుఫ్ జాతికి చెందిన నాలుగు నక్కలను గర్భధారణ ద్వారా పునరుత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగాలు భవిష్యత్లో అంతరించిన జీవజాతుల పునరుత్థానానికి దారితీస్తాయా అనే ఆసక్తి మాత్రం పెరుగుతోంది.
This post was last modified on April 8, 2025 9:55 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…