ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ పట్టలేని ఆనందం, మరోవైపు హార్దిక్ పాండ్య దిగులుతో కూర్చున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారితో పాటు ముంబయి స్టార్ రోహిత్ శర్మ స్పందన కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ముగ్గురు క్రికెటర్లు టీమిండియా తరఫున కలసి ఎన్నో విజయాలను ఆస్వాదించారు. సాధారణంగా ఒకే జెర్సీ ధరించి ఆత్మీయంగా కనిపించే వీళ్లు, ఐపీఎల్ వేదికపై ప్రత్యర్థులుగా మారడంతో అభిమానుల మనసులను రకరకాలుగా అలరిస్తున్నారు. మ్యాచ్లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో రాణించగా, హార్దిక్ మాత్రం తన కెప్టెన్సీలో మరోసారి విఫలమయ్యాడు.
మ్యాచ్లో RCB ముందు బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. కోహ్లీ 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం, అగ్రెషన్ అంతా కనిపించాయి. ఆట ముగిసిన తరువాత కోహ్లీ చేసిన హౌరా సెలబ్రేషన్ అభిమానుల హృదయాలను దోచుకుంది. హడావుడిగా గర్జించిన అంగీకార దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీన్ని చూసిన నెటిజన్లు.. “ఓ కోహ్లీ, ఇది నీ నిజమైన ఫేస్,” “హార్దిక్ ఎంత సైలెంట్గా ఉంటే, విరాట్ అంత చలాకీగా స్పందించాడు,” “ఓటమిని చూసి రోహిత్ ఫేస్ రియాక్షన్ చూడండి,” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ ఎక్స్ప్రెషన్పై మీమ్స్, ట్రోల్స్ తలెత్తుతున్నాయి. ముంబయి వరుస ఓటములతో హార్దిక్కి శాంతి లేదు అనేది స్పష్టమవుతోంది. ఇక ముంబయి ఆటలో మార్పులు తేవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక కోహ్లీ మాత్రం తన స్టైల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. చూస్తుంటే ఈసారి కప్పు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. టీమిండియాలో సమిష్టిగా విజయాలు సాధించిన ఈ ముగ్గురు.. విరాట్, హార్దిక్, రోహిత్.. ఐపీఎల్ వేదికపై ఇలా విభిన్న భావాలతో కనిపించడం ఫ్యాన్స్కు ప్రత్యేక కిక్కు అందిస్తోంది.
This post was last modified on April 8, 2025 9:41 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…