ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్ సెలబ్రేషన్ అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ పట్టలేని ఆనందం, మరోవైపు హార్దిక్ పాండ్య దిగులుతో కూర్చున్న హావభావాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వారితో పాటు ముంబయి స్టార్ రోహిత్ శర్మ స్పందన కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ ముగ్గురు క్రికెటర్లు టీమిండియా తరఫున కలసి ఎన్నో విజయాలను ఆస్వాదించారు. సాధారణంగా ఒకే జెర్సీ ధరించి ఆత్మీయంగా కనిపించే వీళ్లు, ఐపీఎల్ వేదికపై ప్రత్యర్థులుగా మారడంతో అభిమానుల మనసులను రకరకాలుగా అలరిస్తున్నారు. మ్యాచ్లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్తో రాణించగా, హార్దిక్ మాత్రం తన కెప్టెన్సీలో మరోసారి విఫలమయ్యాడు.
మ్యాచ్లో RCB ముందు బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. కోహ్లీ 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం, అగ్రెషన్ అంతా కనిపించాయి. ఆట ముగిసిన తరువాత కోహ్లీ చేసిన హౌరా సెలబ్రేషన్ అభిమానుల హృదయాలను దోచుకుంది. హడావుడిగా గర్జించిన అంగీకార దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీన్ని చూసిన నెటిజన్లు.. “ఓ కోహ్లీ, ఇది నీ నిజమైన ఫేస్,” “హార్దిక్ ఎంత సైలెంట్గా ఉంటే, విరాట్ అంత చలాకీగా స్పందించాడు,” “ఓటమిని చూసి రోహిత్ ఫేస్ రియాక్షన్ చూడండి,” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ ఎక్స్ప్రెషన్పై మీమ్స్, ట్రోల్స్ తలెత్తుతున్నాయి. ముంబయి వరుస ఓటములతో హార్దిక్కి శాంతి లేదు అనేది స్పష్టమవుతోంది. ఇక ముంబయి ఆటలో మార్పులు తేవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక కోహ్లీ మాత్రం తన స్టైల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. చూస్తుంటే ఈసారి కప్పు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. టీమిండియాలో సమిష్టిగా విజయాలు సాధించిన ఈ ముగ్గురు.. విరాట్, హార్దిక్, రోహిత్.. ఐపీఎల్ వేదికపై ఇలా విభిన్న భావాలతో కనిపించడం ఫ్యాన్స్కు ప్రత్యేక కిక్కు అందిస్తోంది.
This post was last modified on April 8, 2025 9:41 am
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…