ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా ఉండాలి? 15 ఏళ్లుగా అయ్యప్పమాల వేస్తున్న భక్తుడికి ఆ మాత్రం సంప్రదాయాలు తెలియవా? ఏళ్ల తరబడి రాములోరి కల్యాణాన్ని వీక్షిస్తున్న భక్తుడికి సీతమ్మ మెడలో తాళి ఎవరు కడతారో కూడా తెలియదా?.. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత బూసినే విరూపాక్షి వ్యవహారాన్ని చూస్తుంటే… ఇవే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యేగా ఉండి.. అయ్యప్ప భక్తుడిని అని చెప్పుకుంటున్న విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి ఆపై బేషరతుగా సారీ చెప్పిన వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అసలు విషమంలోకి వెళితే.. శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారిపోయింది. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ అవుతున్న విషయం, దానిపై హిందూ సంఘాలు చేస్తున్న ఆగ్రహావేశాల గురించి తెలుసుకున్న విరూపాక్షి…క్షణాల్లోనే తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తన వల్ల పొరపాటు జరిగిందని, ఈ పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన వేద పండితుడు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో కట్టానంటూ ఆయన చెప్పారు. మొత్తంగా అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కైన విరూపాక్షి… ఆలస్యం చేయకుండా సారీ చెప్పి తప్పించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 8, 2025 10:59 am
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…