ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా ఉండాలి? 15 ఏళ్లుగా అయ్యప్పమాల వేస్తున్న భక్తుడికి ఆ మాత్రం సంప్రదాయాలు తెలియవా? ఏళ్ల తరబడి రాములోరి కల్యాణాన్ని వీక్షిస్తున్న భక్తుడికి సీతమ్మ మెడలో తాళి ఎవరు కడతారో కూడా తెలియదా?.. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైసీపీ నేత బూసినే విరూపాక్షి వ్యవహారాన్ని చూస్తుంటే… ఇవే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యేగా ఉండి.. అయ్యప్ప భక్తుడిని అని చెప్పుకుంటున్న విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించి ఆపై బేషరతుగా సారీ చెప్పిన వైనం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
అసలు విషమంలోకి వెళితే.. శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి వైరల్ గా మారిపోయింది. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ అవుతున్న విషయం, దానిపై హిందూ సంఘాలు చేస్తున్న ఆగ్రహావేశాల గురించి తెలుసుకున్న విరూపాక్షి…క్షణాల్లోనే తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే సారీ చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తన వల్ల పొరపాటు జరిగిందని, ఈ పొరపాటుకు చింతిస్తున్నానని, ఈ ఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని ఆ వీడియోలో విరూపాక్షి చెప్పుకొచ్చారు. అయినా తాను కావాలని ఈ పని చేయలేదని, తన చేతికి మంగళసూత్రం ఇచ్చిన వేద పండితుడు చెబితేనే.. దానిని సీతమ్మ మెడలో కట్టానంటూ ఆయన చెప్పారు. మొత్తంగా అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా బుక్కైన విరూపాక్షి… ఆలస్యం చేయకుండా సారీ చెప్పి తప్పించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 8, 2025 10:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…