తిమిరి ఇసుకన తైలంబు తీయవచ్చు.. అని భతృహరి శుభాషితం చెబుతున్నా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. లేకపోతే.. ప్రపంచ కుబేరులు సైతం.. బట్టతలతోనే ఎందుకు బతుకుతారు? అనేది ప్రశ్న. కోట్లకు పడగలెత్తిన వారుకూడా.. విగ్గులను ఎందుకు ఆశ్రయిస్తారన్నది మరో ప్రశ్న. సో.. బట్టతల పై వెంట్రుకలు మొలిపించడం అన్నది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
మోసకారులు ఉన్నంత వరకు.. మోసం చేసేవారు ఉన్నారన్నట్టుగా.. తాజాగా బట్టతలపై వెంట్రుకలను చిటెకలో మొలిపిస్తానంటూ.. వచ్చిన కొందరు వ్యక్తులు మన హైదరాబాదీలకు పక్కగా గుండుకొట్టారు. ఉన్న వెంట్రుకలు కూడా తీసేసి.. తైలం రాశారు. ఇంకేముంది.. 24 గంటల్లో తుమ్మ మొక్కలు మొలిచినట్టు మీ నెత్తిపై వెంట్రుకలు వచ్చేస్తాయని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన హైదరాబాదీలు క్యూ కట్టి మరీ.. సదరు వ్యక్తులను నమ్మారు. చివరకు పక్కాగా మోస పోయారు.
ఏం జరిగింది?
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీనిని నమ్మిన కొందరు వ్యక్తులు నిజంగానే తమ బట్టతలకు బ్రహ్మాండమైన రోజులు వస్తున్నాయని భావించారు. ఇంకేముంది.. వకీల్ చెప్పిన చోటుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారి నుంచి వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టేశాడు. అంటే.. ఉన్న కొద్దిపాటి వెంట్రుకలు తీసేశాడు. అనంతరం.. గుండుపై కెమికల్స్ రాసి పంపించాడు.
ఈ సందర్భంగా గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. ఇలా 24 గంటలు ఉంటే.. బ్రహ్మాండంగా వత్తుగా వెంట్రుకలు పెరుగుతాయని వాగ్దానం కూడా చేశాడు. తీరా చూస్తే.. ఇలా కెమికల్ రాయడంతో చాలా మందికి అది రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతలపై వెంట్రుకల మాట ఎలా ఉన్నా.. వందలాది మంది యువకులు ఉన్న జుట్టు కూడా పోయి.. లబోదిబోమంటున్నారు. ఏదేమైనా.. బట్ట తల కూడా అదృష్టమే అనుకుంటే.. ఏ గొడవా ఉండదు కదా.. అంటున్నారు… జుట్టున్న యువకులు.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…