తిమిరి ఇసుకన తైలంబు తీయవచ్చు.. అని భతృహరి శుభాషితం చెబుతున్నా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. లేకపోతే.. ప్రపంచ కుబేరులు సైతం.. బట్టతలతోనే ఎందుకు బతుకుతారు? అనేది ప్రశ్న. కోట్లకు పడగలెత్తిన వారుకూడా.. విగ్గులను ఎందుకు ఆశ్రయిస్తారన్నది మరో ప్రశ్న. సో.. బట్టతల పై వెంట్రుకలు మొలిపించడం అన్నది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
మోసకారులు ఉన్నంత వరకు.. మోసం చేసేవారు ఉన్నారన్నట్టుగా.. తాజాగా బట్టతలపై వెంట్రుకలను చిటెకలో మొలిపిస్తానంటూ.. వచ్చిన కొందరు వ్యక్తులు మన హైదరాబాదీలకు పక్కగా గుండుకొట్టారు. ఉన్న వెంట్రుకలు కూడా తీసేసి.. తైలం రాశారు. ఇంకేముంది.. 24 గంటల్లో తుమ్మ మొక్కలు మొలిచినట్టు మీ నెత్తిపై వెంట్రుకలు వచ్చేస్తాయని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన హైదరాబాదీలు క్యూ కట్టి మరీ.. సదరు వ్యక్తులను నమ్మారు. చివరకు పక్కాగా మోస పోయారు.
ఏం జరిగింది?
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీనిని నమ్మిన కొందరు వ్యక్తులు నిజంగానే తమ బట్టతలకు బ్రహ్మాండమైన రోజులు వస్తున్నాయని భావించారు. ఇంకేముంది.. వకీల్ చెప్పిన చోటుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారి నుంచి వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టేశాడు. అంటే.. ఉన్న కొద్దిపాటి వెంట్రుకలు తీసేశాడు. అనంతరం.. గుండుపై కెమికల్స్ రాసి పంపించాడు.
ఈ సందర్భంగా గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. ఇలా 24 గంటలు ఉంటే.. బ్రహ్మాండంగా వత్తుగా వెంట్రుకలు పెరుగుతాయని వాగ్దానం కూడా చేశాడు. తీరా చూస్తే.. ఇలా కెమికల్ రాయడంతో చాలా మందికి అది రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతలపై వెంట్రుకల మాట ఎలా ఉన్నా.. వందలాది మంది యువకులు ఉన్న జుట్టు కూడా పోయి.. లబోదిబోమంటున్నారు. ఏదేమైనా.. బట్ట తల కూడా అదృష్టమే అనుకుంటే.. ఏ గొడవా ఉండదు కదా.. అంటున్నారు… జుట్టున్న యువకులు.
This post was last modified on April 7, 2025 6:54 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…