తిమిరి ఇసుకన తైలంబు తీయవచ్చు.. అని భతృహరి శుభాషితం చెబుతున్నా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. లేకపోతే.. ప్రపంచ కుబేరులు సైతం.. బట్టతలతోనే ఎందుకు బతుకుతారు? అనేది ప్రశ్న. కోట్లకు పడగలెత్తిన వారుకూడా.. విగ్గులను ఎందుకు ఆశ్రయిస్తారన్నది మరో ప్రశ్న. సో.. బట్టతల పై వెంట్రుకలు మొలిపించడం అన్నది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
మోసకారులు ఉన్నంత వరకు.. మోసం చేసేవారు ఉన్నారన్నట్టుగా.. తాజాగా బట్టతలపై వెంట్రుకలను చిటెకలో మొలిపిస్తానంటూ.. వచ్చిన కొందరు వ్యక్తులు మన హైదరాబాదీలకు పక్కగా గుండుకొట్టారు. ఉన్న వెంట్రుకలు కూడా తీసేసి.. తైలం రాశారు. ఇంకేముంది.. 24 గంటల్లో తుమ్మ మొక్కలు మొలిచినట్టు మీ నెత్తిపై వెంట్రుకలు వచ్చేస్తాయని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన హైదరాబాదీలు క్యూ కట్టి మరీ.. సదరు వ్యక్తులను నమ్మారు. చివరకు పక్కాగా మోస పోయారు.
ఏం జరిగింది?
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీనిని నమ్మిన కొందరు వ్యక్తులు నిజంగానే తమ బట్టతలకు బ్రహ్మాండమైన రోజులు వస్తున్నాయని భావించారు. ఇంకేముంది.. వకీల్ చెప్పిన చోటుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారి నుంచి వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టేశాడు. అంటే.. ఉన్న కొద్దిపాటి వెంట్రుకలు తీసేశాడు. అనంతరం.. గుండుపై కెమికల్స్ రాసి పంపించాడు.
ఈ సందర్భంగా గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. ఇలా 24 గంటలు ఉంటే.. బ్రహ్మాండంగా వత్తుగా వెంట్రుకలు పెరుగుతాయని వాగ్దానం కూడా చేశాడు. తీరా చూస్తే.. ఇలా కెమికల్ రాయడంతో చాలా మందికి అది రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతలపై వెంట్రుకల మాట ఎలా ఉన్నా.. వందలాది మంది యువకులు ఉన్న జుట్టు కూడా పోయి.. లబోదిబోమంటున్నారు. ఏదేమైనా.. బట్ట తల కూడా అదృష్టమే అనుకుంటే.. ఏ గొడవా ఉండదు కదా.. అంటున్నారు… జుట్టున్న యువకులు.
This post was last modified on April 7, 2025 6:54 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…