పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది.
మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా స్టాండ్స్ వైపు పరుగెత్తి ప్రేక్షకులను నిలదీయడం, వారిని బెదిరించేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం మ్యాచ్ అనంతరం కొంతమంది ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులు పాక్ ఆటగాళ్లను దుర్భాషలాడటం అని తెలుస్తోంది. ఖుష్దిల్ వారిని సైలెంట్ చేసేందుకు ప్రయత్నించినా.. దురుసు మాటలతోనే ఎదుర్కొనడంతో కోపం తాళలేక ఆ దిశగా దూసుకెళ్లాడు. అయితే అక్కడే మిగతా ప్లేయర్లు, సెక్యూరిటీ అధికారులు జోక్యం చేసుకోవడంతో పెద్ద సమస్య తప్పింది.
ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పందిస్తూ.. తమ ఆటగాళ్లను లక్ష్యంగా తీసుకొని ఏ విదేశీ అభిమానులు అవమానకరంగా ప్రవర్తించినా తాము సహించబోమని పేర్కొంది. మైదానంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని, అలాంటి దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని వెల్లడించింది. అదే సమయంలో తమ ఆటగాళ్లు కూడా ఎలాంటి ఉద్రిక్తతకు లోనుకాకుండా స్పందించాలని సూచించినట్టు సమాచారం.
ఇక క్రికెట్ అభిమానులు ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఖుష్దిల్కి మద్దతుగా నిలుస్తూ.. వ్యక్తిగత అవమానాలు చేస్తే ఎవ్వరైనా మానవత్వంతో స్పందించాల్సిందే అంటున్నారు. మరికొంతమంది మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్గా వ్యవహరిస్తున్నావంటే నియంత్రణ కావాలని, ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అంటున్నారు. మొత్తానికి ఓ పరాజయం మాత్రమే కాదు.. దాని ప్రభావం ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎంతగానో పడుతున్న విషయం ఖుష్దిల్ చర్యల ద్వారా మరోసారి రుజువైంది.
This post was last modified on April 6, 2025 3:08 pm
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…