Trends

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది.

మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా స్టాండ్స్ వైపు పరుగెత్తి ప్రేక్షకులను నిలదీయడం, వారిని బెదిరించేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం మ్యాచ్ అనంతరం కొంతమంది ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులు పాక్ ఆటగాళ్లను దుర్భాషలాడటం అని తెలుస్తోంది. ఖుష్దిల్ వారిని సైలెంట్ చేసేందుకు ప్రయత్నించినా.. దురుసు మాటలతోనే ఎదుర్కొనడంతో కోపం తాళలేక ఆ దిశగా దూసుకెళ్లాడు. అయితే అక్కడే మిగతా ప్లేయర్లు, సెక్యూరిటీ అధికారులు జోక్యం చేసుకోవడంతో పెద్ద సమస్య తప్పింది.

ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పందిస్తూ.. తమ ఆటగాళ్లను లక్ష్యంగా తీసుకొని ఏ విదేశీ అభిమానులు అవమానకరంగా ప్రవర్తించినా తాము సహించబోమని పేర్కొంది. మైదానంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని, అలాంటి దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని వెల్లడించింది. అదే సమయంలో తమ ఆటగాళ్లు కూడా ఎలాంటి ఉద్రిక్తతకు లోనుకాకుండా స్పందించాలని సూచించినట్టు సమాచారం.

ఇక క్రికెట్ అభిమానులు ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఖుష్దిల్‌కి మద్దతుగా నిలుస్తూ.. వ్యక్తిగత అవమానాలు చేస్తే ఎవ్వరైనా మానవత్వంతో స్పందించాల్సిందే అంటున్నారు. మరికొంతమంది మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నావంటే నియంత్రణ కావాలని, ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అంటున్నారు. మొత్తానికి ఓ పరాజయం మాత్రమే కాదు.. దాని ప్రభావం ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎంతగానో పడుతున్న విషయం ఖుష్దిల్ చర్యల ద్వారా మరోసారి రుజువైంది. 

This post was last modified on April 6, 2025 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago