Trends

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది.

మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా స్టాండ్స్ వైపు పరుగెత్తి ప్రేక్షకులను నిలదీయడం, వారిని బెదిరించేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం మ్యాచ్ అనంతరం కొంతమంది ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులు పాక్ ఆటగాళ్లను దుర్భాషలాడటం అని తెలుస్తోంది. ఖుష్దిల్ వారిని సైలెంట్ చేసేందుకు ప్రయత్నించినా.. దురుసు మాటలతోనే ఎదుర్కొనడంతో కోపం తాళలేక ఆ దిశగా దూసుకెళ్లాడు. అయితే అక్కడే మిగతా ప్లేయర్లు, సెక్యూరిటీ అధికారులు జోక్యం చేసుకోవడంతో పెద్ద సమస్య తప్పింది.

ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పందిస్తూ.. తమ ఆటగాళ్లను లక్ష్యంగా తీసుకొని ఏ విదేశీ అభిమానులు అవమానకరంగా ప్రవర్తించినా తాము సహించబోమని పేర్కొంది. మైదానంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని, అలాంటి దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని వెల్లడించింది. అదే సమయంలో తమ ఆటగాళ్లు కూడా ఎలాంటి ఉద్రిక్తతకు లోనుకాకుండా స్పందించాలని సూచించినట్టు సమాచారం.

ఇక క్రికెట్ అభిమానులు ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఖుష్దిల్‌కి మద్దతుగా నిలుస్తూ.. వ్యక్తిగత అవమానాలు చేస్తే ఎవ్వరైనా మానవత్వంతో స్పందించాల్సిందే అంటున్నారు. మరికొంతమంది మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నావంటే నియంత్రణ కావాలని, ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అంటున్నారు. మొత్తానికి ఓ పరాజయం మాత్రమే కాదు.. దాని ప్రభావం ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎంతగానో పడుతున్న విషయం ఖుష్దిల్ చర్యల ద్వారా మరోసారి రుజువైంది. 

This post was last modified on April 6, 2025 3:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

57 minutes ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

4 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

5 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago