Trends

కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ తరవాత పూర్తిగా తడబడింది. వరుసగా మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరికి జారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలవడంతో రెండు పాయింట్లకే పరిమితమైంది. నేడు గుజరాత్ టైటన్స్‌తో హోం గ్రౌండ్‌లో తలపడబోతుండగా, ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకం.

బ్యాటింగ్‌లో ఒక్క మ్యాచ్ తప్ప మిగిలినవన్నీ నిరుత్సాహపరిచాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా, ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే అవుటవుతుండటంతో జట్టు భారీ స్కోర్లకు చేరడం సాధ్యపడడం లేదు. మిడిల్ ఆర్డర్ పూర్తిగా తేలిపోవడమే ఓటములకు కారణమవుతోంది. అభిషేక్ ఒక్కొసారి మెరుస్తున్నా, స్థిరత లేకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది.

ఇంకా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో బౌలింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఒకప్పుడు మ్యాచ్‌లను తిరగరాస్తూ కట్టిపడేసే సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్.. ఇప్పుడు ప్రెషర్ సిచ్యుయేషన్లలో తేలిపోతుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌కు 240 పైచిలుకు పరుగులు ఇవ్వడం సునాయాసంగా ఊహించనిది. వరుసగా ఓటములు ఇలానే కోనసాగితే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఆశలు కూడా మందగిస్థాయి.

ఈ నేపథ్యంలో గుజరాత్‌పై హోం గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్ కీలకం. మరోసారి ఓడిపోతే జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్లడం కాయం. బ్యాటింగ్‌లోనైనా, బౌలింగ్‌లోనైనా ఈసారి స్పెషల్ చూపించాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లలో చూపించిన ‘కాటేరమ్మ కొడుకుల’ శక్తిని మళ్లీ చాటితేనే జట్టుకు బలం కలుగుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి ఈ ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూద్దాం.

Kumar

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

33 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

3 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

9 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

9 hours ago