Trends

ఐపీఎల్: క్రేజ్ ఉంది కానీ.. ఫామ్ లేదు!

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ క్రికెటర్లు తాము చూపించిన ఆటతీరుతో మాత్రం పిచ్‌పై కాస్తా ఒత్తిడిని కలిగిస్తున్నారు. పేరు మోగిన ఆటగాళ్ల నుంచి ఊహించిన విధంగా ఆట లేదు. దీనివల్ల ఫ్యాన్స్ కూడా ప్రశ్నలు వేస్తున్నారు.. స్టార్‌లు మరీ ఇంత తేలిగ్గా వెనకబడతారా? అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

భారీ మొత్తాలకు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు తక్కువ పరుగులకే అవుటవుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఆటగాళ్లు గత సీజన్లలో రాణించగా, ఈసారి మాత్రం వారు ఆ స్థాయిలో కనిపించడం లేదు. పంత్ రూ.27 కోట్లకు అమ్ముడై కెప్టెన్‌గా బరిలోకి దిగినా నాలుగు మ్యాచుల్లో 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఇదే పరిస్థితి మరికొంతమందికీ వర్తిస్తోంది.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు తమ పేరుకు తగ్గ ఆటతీరును చూపలేకపోతున్నారు. జైస్వాల్ మూడు మ్యాచుల్లో కేవలం 34 పరుగులు చేయగా, రోహిత్ నాలుగు మ్యాచ్‌లలో 21 పరుగులకే పరిమితమయ్యారు. ఇది వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే పెద్ద అసమర్థతే. అభిమానులు ఆశించిన సునామీలా కాకుండా, వీరి బ్యాటింగ్ మూడో బంతికే కుదిపేస్తోంది.

ఇదే సమయంలో ఐపీఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు మాత్రం ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వందల కోట్ల పెట్టుబడులకు భరోసాగా ఉండాల్సిన సీనియర్లు తామే బలహీన కండీషన్‌లో ఉన్నట్టు చూపుతున్నారు. ఈ పాయింట్‌ను బట్టి చూస్తే వచ్చే టోర్నీల్లో యువతకే ఎక్కువ ప్రాధాన్యత దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఐపీఎల్ 2025 ప్రారంభంలోనే స్టార్ ఆటగాళ్లు తలదించుకునే ప్రదర్శన చూపించారు. ఇంకా సీజన్ మొదటి దశలోనే ఉన్నప్పటికీ, ఈ ఆటగాళ్లు తక్షణమే తమ ఫామ్‌ను తిరిగి పొందలేకపోతే, టీమ్‌ఇండియా అవకాశాలు దూరమవడం ఖాయం.

This post was last modified on April 5, 2025 2:51 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

1 hour ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

1 hour ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

2 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

2 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

3 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

5 hours ago