ఐపీఎల్ 2025 సీజన్లో ఆటకు మించిన డ్రామాలు ఎక్కువైపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యువ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ పేరు ఇందుకు ఉదాహరణగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై లక్నో ఓటమిపాలవగా, మ్యాచ్లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన తరువాత దిగ్వేశ్ సింగ్ చేసిన హావభావాలు వివాదాస్పదంగా మారాయి.
అతని నేరుగా ప్రియాన్ష్ దగ్గరకు వెళ్లి లెటర్ రాస్తున్నట్టు హావభావాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది బీసీసీఐ దృష్టికి చేరింది. ఈ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్గా స్పందించింది. తమ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను దిగ్వేశ్ సింగ్కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతే కాకుండా అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది. ఇది మొదటిసారి అయినప్పటికీ, మళ్లీ ఇలాంటి తప్పిదం చేస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆటలో భావోద్వేగాలు సహజమే అయినా, అవి మర్యాదా రీతిలో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్లో స్నేహితులే ప్రత్యర్థులై ఆడాల్సి వస్తే ఎమోషన్స్ ఎక్కువవుతాయనే వాదన ఉంది. కానీ, గతంలో ఢిల్లీ టీ20 లీగ్లో ఒకే జట్టుకు ఆడిన ప్రియాన్ష్, దిగ్వేశ్ మధ్య ఇప్పుడు ఇలా ఘర్షణగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆట ముగిసిన తర్వాత మాత్రం ఇద్దరూ హ్యాండ్షేక్ చేసుకుని మాట్లాడినట్లు కెమెరాల్లో కనిపించింది. కానీ మ్యాచ్ సమయంలో చేసిన ఆ వ్యాఖ్యాత్మక హావభావాలను మాత్రం ఐపీఎల్ పాలక మండలి ఉపేక్షించలేదు.
ఈ ఘటన అనంతరం లక్నో ఫ్రాంఛైజీ నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం రెండువైపులా భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దిగ్వేశ్పై సరదాగా స్పందిస్తే, మరికొందరు మాత్రం ఇది అనవసరమైన ప్రవర్తన అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇకపై మరింత బాధ్యతగా ఆడేలా చేస్తాయనడంలో సందేహం లేదు.
This post was last modified on April 2, 2025 6:12 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…