ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు చేసిన ఖరీదైన బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.వెయ్యి కోట్లు విలువైన ఈ విలాసవంతమైన జెట్ కలిగి ఉన్న మొదటి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీనే. ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే బోయింగ్ 737 మ్యాక్స్ 9 మాత్రం ఇస్పెషల్. ఇంత ఖరీదైన విమానం ఉన్న మొట్టమొదటి పారిశ్రామికవేత్తగా ముకేశ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
ఈ ఖరీదైన జెట్ ను వాషింగ్టన్ లోని రెంటన్ లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేశారు. నిజానికి ఈ జెట్ 2022లోనే డెలివరీ కావాల్సి ఉంది. కాకుంటే.. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ ఆలస్యమైంది. భారత్ కు రావటానికి ముందు ఈ విమానాన్ని బాసెల్.. జెనీవా.. లండన్ లలో విస్తృత పరీక్షల్ని నిర్వహించారు. అన్నింటిలోనూ ఇది తన సత్తాను చాటింది. ఈ ప్రైవేట్ జెట్ ప్రత్యేకత ఏమంటే.. ఒకేదఫా 11,770 కి.మీ వరకు ప్రయాణించే సత్తా దీని సొంతం. వేగంతో పాటు లగ్జరీ కలిసి కట్టుగా ఉండే ఈ విమానాన్ని ఆకాశంలో సెవెన్ స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు.
ఈ ప్రైవేటు జెట్ ను ముకేశ్ అంబానీ తమ అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించారు. ఈ ప్రైవేట్ జెట్ కు మరో ప్రత్యేకత ఉంది. విశాలమైన క్యాబిన్ తో పాటు పెద్ద కార్గో సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న దీనికి ఎంఎస్ఎన్ 8401 రిజిస్ట్రేషన్ నంబరు కలిగి ఉన్నట్లు చెబుతారు. ఇదే కాకుండా బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ఈఆర్జే 135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేటు జెట్ లు అంబానీ వద్ద ఉన్నాయి. అంబానీనా మజాకానా?
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…