ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు చేసిన ఖరీదైన బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.వెయ్యి కోట్లు విలువైన ఈ విలాసవంతమైన జెట్ కలిగి ఉన్న మొదటి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీనే. ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే బోయింగ్ 737 మ్యాక్స్ 9 మాత్రం ఇస్పెషల్. ఇంత ఖరీదైన విమానం ఉన్న మొట్టమొదటి పారిశ్రామికవేత్తగా ముకేశ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
ఈ ఖరీదైన జెట్ ను వాషింగ్టన్ లోని రెంటన్ లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేశారు. నిజానికి ఈ జెట్ 2022లోనే డెలివరీ కావాల్సి ఉంది. కాకుంటే.. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ ఆలస్యమైంది. భారత్ కు రావటానికి ముందు ఈ విమానాన్ని బాసెల్.. జెనీవా.. లండన్ లలో విస్తృత పరీక్షల్ని నిర్వహించారు. అన్నింటిలోనూ ఇది తన సత్తాను చాటింది. ఈ ప్రైవేట్ జెట్ ప్రత్యేకత ఏమంటే.. ఒకేదఫా 11,770 కి.మీ వరకు ప్రయాణించే సత్తా దీని సొంతం. వేగంతో పాటు లగ్జరీ కలిసి కట్టుగా ఉండే ఈ విమానాన్ని ఆకాశంలో సెవెన్ స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు.
ఈ ప్రైవేటు జెట్ ను ముకేశ్ అంబానీ తమ అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించారు. ఈ ప్రైవేట్ జెట్ కు మరో ప్రత్యేకత ఉంది. విశాలమైన క్యాబిన్ తో పాటు పెద్ద కార్గో సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న దీనికి ఎంఎస్ఎన్ 8401 రిజిస్ట్రేషన్ నంబరు కలిగి ఉన్నట్లు చెబుతారు. ఇదే కాకుండా బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ఈఆర్జే 135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేటు జెట్ లు అంబానీ వద్ద ఉన్నాయి. అంబానీనా మజాకానా?
This post was last modified on March 29, 2025 10:42 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…