Trends

ముకేశ్ అంబానీ రూ.వెయ్యి కోట్ల విమానం వచ్చేసింది

ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు చేసిన ఖరీదైన బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.వెయ్యి కోట్లు విలువైన ఈ విలాసవంతమైన జెట్ కలిగి ఉన్న మొదటి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీనే. ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే బోయింగ్ 737 మ్యాక్స్ 9 మాత్రం ఇస్పెషల్. ఇంత ఖరీదైన విమానం ఉన్న మొట్టమొదటి పారిశ్రామికవేత్తగా ముకేశ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

ఈ ఖరీదైన జెట్ ను వాషింగ్టన్ లోని రెంటన్ లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేశారు. నిజానికి ఈ జెట్ 2022లోనే డెలివరీ కావాల్సి ఉంది. కాకుంటే.. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ ఆలస్యమైంది. భారత్ కు రావటానికి ముందు ఈ విమానాన్ని బాసెల్.. జెనీవా.. లండన్ లలో విస్తృత పరీక్షల్ని నిర్వహించారు. అన్నింటిలోనూ ఇది తన సత్తాను చాటింది. ఈ ప్రైవేట్ జెట్ ప్రత్యేకత ఏమంటే.. ఒకేదఫా 11,770 కి.మీ వరకు ప్రయాణించే సత్తా దీని సొంతం. వేగంతో పాటు లగ్జరీ కలిసి కట్టుగా ఉండే ఈ విమానాన్ని ఆకాశంలో సెవెన్ స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు.

ఈ ప్రైవేటు జెట్ ను ముకేశ్ అంబానీ తమ అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించారు. ఈ ప్రైవేట్ జెట్ కు మరో ప్రత్యేకత ఉంది. విశాలమైన క్యాబిన్ తో పాటు పెద్ద కార్గో సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న దీనికి ఎంఎస్ఎన్ 8401 రిజిస్ట్రేషన్ నంబరు కలిగి ఉన్నట్లు చెబుతారు. ఇదే కాకుండా బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ఈఆర్జే 135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేటు జెట్ లు అంబానీ వద్ద ఉన్నాయి. అంబానీనా మజాకానా?

This post was last modified on March 29, 2025 10:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…

2 hours ago

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని…

3 hours ago

మందే ముంచేసింది.. పాస్ట‌ర్ మృతిపై క్లారిటీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేకెత్తించి.. అనేక అనుమానాల‌ను కూడా సృష్టించిన పాస్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ప‌గ‌డాల మృతి వ్య‌వ‌హారంలో…

4 hours ago

కాకాణికి ఖాకీల నోటీసులు!… రేపు ఎంక్వైరీకి వస్తారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…

5 hours ago

బాబు మౌనం.. ముస్లింల నిర‌స‌న‌.. రీజ‌నేంటి?

ఏపీలో కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గ‌త వారం రోజులుగా నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్ర‌భుత్వం…

6 hours ago

మొన్న రణవీర్, నిన్న కునాల్.. నేడు స్వాతి

స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…

7 hours ago