ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను శుక్రవారం భూకంపం వణికించింది. వరుసగా రెండు భారీ భూకంపాలు చోటుచేసుకోగా.. ఈ రెండు దేశాల్లో భారీ నష్టమే చోటుచేసుకుంది. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా…రెండో భూకంపం 6.4 తీవ్రతో చోటుచేసుకుంది. వరుసగా రెండు భూకంపాలు నిమిషాల వ్యవధిలో చోటుచేసుకోవడంతో నష్టం భారీగా జరిగింది. ఈ భూకంపాల కారణంగా ఈ రెండు దేశాల్లో చోటుచేసుకున్న నష్టం వివరాలకు చెందిన దృశ్యాలు యావత్తు ప్రపంచాన్ని హడలెత్తించాయి.
భూకంపం ధాటికి థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. ఆకాశహార్మ్యాలను తలపించేలా ఉన్న బహుళఅంతస్థుల భవంతులన్నీ భూకంపం ధాటికి పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. చూస్తుండగానే ఆ భవనాల అలా కూలిపోతున్న దృశ్యాలు గగుర్పాటును కలిగించాయని చెప్పక తప్పదు. కూలిన భవనాలన్నీ వాణిజ్య భవనాలేనని కొందరు చెబుతుండగా… వాటిలో కొన్ని రెసిడెన్షియల్ భవనాలు కూడా ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. భవంతులన్నీ అలా పేకమడల్లా కూలిపోతూ ఉంటే… జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు అక్కడి భయానక పరిస్థిని కళ్లకు కట్టింది.
అయితే ఈ భూకంపాలు జరిగిన తర్వాత పరిస్థితి సాదారణంగా మారిపోగా… అప్పటికే జరిగిన నష్టంతో మయన్మార్ లోని పలు ప్రాంతాలు, థాయ్ ల్యాండ్ రాజదాని బ్యాంకాక్ సహా ప్రధాన పట్టణాల్లో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్డపైకి వచ్చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. నిత్యం పర్యాటకులతో కళకళలాడే బ్యాంకాక్… ఈ భూకంపాల నేపథ్యంలో ఖాళీ అయిపోతోంది. ఇదిలా ఉంటే… భూకంపం సంభవించిన వెంటనే అక్కడి ప్రభుత్వాలు సహాయక చర్యలను మొదలుపెట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు మొదలయ్యాయి.
This post was last modified on March 28, 2025 7:39 pm
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే…