Trends

46 ఏళ్లు జైలులోనే.. చివరికి రూ.20 కోట్ల నష్టపరిహారం!

ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్‌లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంచలన తీర్పు వెలువరించింది.

హకమడ ఒకప్పటి ప్రొఫెషనల్ బాక్సర్. ఉద్యోగ విరమణ తర్వాత ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం సాగిస్తున్న ఆయనపై 1966లో జరిగిన ఓ దారుణ హత్యకు సంబంధించి నేరం మోపారు. నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరోపణల ఆధారంగా 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ, విచారణ, శారీరక ఒత్తిడి, విచారణలో బలవంతపు ఒప్పుకోలు వంటి అంశాలన్నీ తరువాత తీవ్రమైన విమర్శలకు లోనయ్యాయి.

ఈ కేసులో సాక్ష్యాలు కల్పించబడ్డాయని, పోలీసులు రక్తంతో నానిన దుస్తులను తనవిగా ప్రదర్శించారని హకమడ తరఫు న్యాయవాదులు వాదించారు. దీన్ని గమనించిన కోర్టు 2024లో అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అతను ఇప్పటికే జీవితంలోని విలువైన భాగం కోల్పోయాడన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రభుత్వం రూ.20 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

నిర్దోషి వ్యక్తి జీవితాన్ని వందల కోట్లు ఇచ్చినా తిరిగి తేవలేమన్నది హకమడ జీవితంలోని ఘటన ఒక ఉదాహరణ. ఇప్పటికీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు కోర్టు తీర్పు ఒక న్యాయబద్ధమైన గౌరవమే అయినప్పటికీ… చేసిన తప్పుకు శిక్ష పడడమే కాదు, చేయని నేరానికీ శిక్ష అనుభవించాలంటే ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది.

Kumar

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

2 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

4 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

6 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

6 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

8 hours ago