Trends

46 ఏళ్లు జైలులోనే.. చివరికి రూ.20 కోట్ల నష్టపరిహారం!

ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్‌లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంచలన తీర్పు వెలువరించింది.

హకమడ ఒకప్పటి ప్రొఫెషనల్ బాక్సర్. ఉద్యోగ విరమణ తర్వాత ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం సాగిస్తున్న ఆయనపై 1966లో జరిగిన ఓ దారుణ హత్యకు సంబంధించి నేరం మోపారు. నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరోపణల ఆధారంగా 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ, విచారణ, శారీరక ఒత్తిడి, విచారణలో బలవంతపు ఒప్పుకోలు వంటి అంశాలన్నీ తరువాత తీవ్రమైన విమర్శలకు లోనయ్యాయి.

ఈ కేసులో సాక్ష్యాలు కల్పించబడ్డాయని, పోలీసులు రక్తంతో నానిన దుస్తులను తనవిగా ప్రదర్శించారని హకమడ తరఫు న్యాయవాదులు వాదించారు. దీన్ని గమనించిన కోర్టు 2024లో అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అతను ఇప్పటికే జీవితంలోని విలువైన భాగం కోల్పోయాడన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రభుత్వం రూ.20 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

నిర్దోషి వ్యక్తి జీవితాన్ని వందల కోట్లు ఇచ్చినా తిరిగి తేవలేమన్నది హకమడ జీవితంలోని ఘటన ఒక ఉదాహరణ. ఇప్పటికీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు కోర్టు తీర్పు ఒక న్యాయబద్ధమైన గౌరవమే అయినప్పటికీ… చేసిన తప్పుకు శిక్ష పడడమే కాదు, చేయని నేరానికీ శిక్ష అనుభవించాలంటే ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది.

This post was last modified on March 26, 2025 10:06 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago