ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంచలన తీర్పు వెలువరించింది.
హకమడ ఒకప్పటి ప్రొఫెషనల్ బాక్సర్. ఉద్యోగ విరమణ తర్వాత ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం సాగిస్తున్న ఆయనపై 1966లో జరిగిన ఓ దారుణ హత్యకు సంబంధించి నేరం మోపారు. నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరోపణల ఆధారంగా 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ, విచారణ, శారీరక ఒత్తిడి, విచారణలో బలవంతపు ఒప్పుకోలు వంటి అంశాలన్నీ తరువాత తీవ్రమైన విమర్శలకు లోనయ్యాయి.
ఈ కేసులో సాక్ష్యాలు కల్పించబడ్డాయని, పోలీసులు రక్తంతో నానిన దుస్తులను తనవిగా ప్రదర్శించారని హకమడ తరఫు న్యాయవాదులు వాదించారు. దీన్ని గమనించిన కోర్టు 2024లో అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అతను ఇప్పటికే జీవితంలోని విలువైన భాగం కోల్పోయాడన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రభుత్వం రూ.20 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
నిర్దోషి వ్యక్తి జీవితాన్ని వందల కోట్లు ఇచ్చినా తిరిగి తేవలేమన్నది హకమడ జీవితంలోని ఘటన ఒక ఉదాహరణ. ఇప్పటికీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు కోర్టు తీర్పు ఒక న్యాయబద్ధమైన గౌరవమే అయినప్పటికీ… చేసిన తప్పుకు శిక్ష పడడమే కాదు, చేయని నేరానికీ శిక్ష అనుభవించాలంటే ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…