ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంచలన తీర్పు వెలువరించింది.
హకమడ ఒకప్పటి ప్రొఫెషనల్ బాక్సర్. ఉద్యోగ విరమణ తర్వాత ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం సాగిస్తున్న ఆయనపై 1966లో జరిగిన ఓ దారుణ హత్యకు సంబంధించి నేరం మోపారు. నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరోపణల ఆధారంగా 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ, విచారణ, శారీరక ఒత్తిడి, విచారణలో బలవంతపు ఒప్పుకోలు వంటి అంశాలన్నీ తరువాత తీవ్రమైన విమర్శలకు లోనయ్యాయి.
ఈ కేసులో సాక్ష్యాలు కల్పించబడ్డాయని, పోలీసులు రక్తంతో నానిన దుస్తులను తనవిగా ప్రదర్శించారని హకమడ తరఫు న్యాయవాదులు వాదించారు. దీన్ని గమనించిన కోర్టు 2024లో అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అతను ఇప్పటికే జీవితంలోని విలువైన భాగం కోల్పోయాడన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రభుత్వం రూ.20 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
నిర్దోషి వ్యక్తి జీవితాన్ని వందల కోట్లు ఇచ్చినా తిరిగి తేవలేమన్నది హకమడ జీవితంలోని ఘటన ఒక ఉదాహరణ. ఇప్పటికీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు కోర్టు తీర్పు ఒక న్యాయబద్ధమైన గౌరవమే అయినప్పటికీ… చేసిన తప్పుకు శిక్ష పడడమే కాదు, చేయని నేరానికీ శిక్ష అనుభవించాలంటే ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది.
This post was last modified on March 26, 2025 10:06 pm
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…