హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంపై కలిగిన కోపంతో ఓ వ్యక్తి యోగా టీచర్ను ఏడడుగుల గోతిలో సజీవంగా పాతిపెట్టిన దారుణం చోటుచేసుకుంది. మూడు నెలలుగా అదృశ్యంగా ఉన్న జగదీప్ అనే యోగా టీచర్ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, జగదీప్ డిసెంబర్ 24న రోహ్తక్లోని తన ఇంటికి వెళ్లే సమయంలో కిడ్నాప్ చేశారు.
నిందితుడు ధర్మపాల్ అనే వ్యక్తి, తన మిత్రుడు హర్దీప్తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ముందుగానే ప్లాన్ చేసిన విధంగా జగదీప్ చేతులు, కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి, ముందే తవ్విన ఏడడుగుల గోతిలో బ్రతికుండగానే పాతిపెట్టారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే కాల్ డేటాను ఆధారంగా తీసుకుని విచారణ జరిపిన వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి, జగదీప్ నిందితుడు ధర్మపాల్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అదే సమయంలో ధర్మపాల్ భార్యతో జగదీప్ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని భావించి, నిదానంగా ద్వేషం పెరిగింది. చివరికి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో జగదీప్ ప్రాణం తీశాడు. ప్లాన్ చేసుకుని, ఏడుగుల గోతిని తవ్వించి, నేరాన్ని చాలా ప్లానింగ్తో చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన భార్యపై ప్రభావం చూపించాడని భావించిన ధర్మపాల్, ఇదే సరైన శిక్ష అంటూ ఏకంగా మరణం వరకూ వెళ్లాడు. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.
This post was last modified on March 26, 2025 3:02 pm
హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని.. దీంతో…
శ్రీవిశ్వావసు నామ తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు.…
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…