తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 36 ఏళ్ల తమీమ్.. సోమవారం ఢాకా ప్రిమియర్ లీగ్లో భాగంగా మ్యాచ్ సందర్భంగా గుండె పోటుకు గురయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయడానికి కెప్టెన్గా మైదానంలోకి వచ్చాడు తమీమ్. ఉన్నట్లుండి అతడికి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గుండె పోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించడంతో అక్కడ్నుంచి అత్యవసరంగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు హెలికాఫ్టర్ తెప్పించారు. కానీ హెలిప్యాడ్కు వెళ్తుండగానే మరోసారి తమీమ్కు గుండెపోటు వచ్చింది. ఈసారి హార్ట్ ఎటాక్ తీవ్ర స్థాయిలో రావడంతో తన పరిస్థితి విషమించింది.
ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగానే ఉందని.. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమీమ్కు చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమీమ్ పేరు చెప్పగానే భారత క్రికెట్ అభిమానులకు 2007 వన్డే ప్రపంచకప్ గుర్తుకు వస్తుంది. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ సంచలన విజయంతో భారత్ను ఇంటిముఖం పట్టించడంలో తమీమ్ పాత్ర కీలకం.
అప్పటికి తన వయసు 18 ఏళ్లే. ఆ తర్వాత తమీమ్ బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఓపెనర్ అయిన తమీమ్ కొంత కాలం బంగ్లాదేశ్కు కెప్టెన్గా కూడా పని చేశాడు. మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్న తమీమ్.. ఈ ఏడాది జనవరిలోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టెస్టుల్లో బంగ్లాదేశ్కు ప్రాతినిధ్యం వహించాడు. తమీమ్ కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on March 24, 2025 4:24 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…