ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టింది. ఈ అమానుష చర్య చివరకు ఓ చిన్నారి మాటలతో బయటపడింది.
సౌరభ్ హత్య అనంతరం ముస్కాన్ ప్రియుడితో కలిసి ట్రిప్ వెళ్లిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో మరమ్మతులు చేయించేందుకు ఇంటి యజమాని కూలీలను పంపించాడు. కూలీలు డ్రమ్మును కదిలించడానికి ప్రయత్నించగా అది చాలా బరువుగా ఉందని గమనించారు. దీంతో లోపల ఏముందని అడగగా, చెత్తాచెదారం ఉందని ముస్కాన్ చెప్పింది. అయితే మూత తీసి చూడగా అసహనకరమైన దుర్వాసన రావడంతో అనుమానాలతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మరింత భయానకంగా మారినది.
ఈ హత్యను గుర్తించడంలో సౌరభ్ ఆరేళ్ల కుమార్తె కీలకంగా మారింది. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని చిన్నారి పొరుగింటి వారికి పదేపదే చెప్పడం గమనించిన ముస్కాన్ తన కుమార్తెను వెంటనే వేరే చోటుకు పంపించేసింది. అయితే, ఇది ఆమె తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, చివరకు వాస్తవం బయటపడకుండా ఆపలేకపోయింది. ముస్కాన్ హత్య నిజం బయటకు వచ్చిన తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అన్ని వివరాలు చెప్పడంతో వారు షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.
తమ కూతురి నేరానికి తీవ్రంగా స్పందించిన ముస్కాన్ తల్లిదండ్రులు, నిందితురాలికి ఉరిశిక్ష విధించాలని కోరడం గమనార్హం. ఈ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును పరిశీలించిన పోలీసులు ముస్కాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సౌరభ్ తల్లి రేణు దేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచి, అతని భవిష్యత్తును సాకారం చేసేందుకు పంపించామని, కానీ ఇలాంటి దారుణమైన హత్య జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య చేసిన తన కోడలు, ఆమె ప్రియుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
This post was last modified on March 20, 2025 1:11 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…