Trends

భర్తను ముక్కలు చేసిన భార్య.. కూతుర్ని ఉరి తియ్యమంటున్న తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్‌ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్‌ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టింది. ఈ అమానుష చర్య చివరకు ఓ చిన్నారి మాటలతో బయటపడింది.

సౌరభ్‌ హత్య అనంతరం ముస్కాన్‌ ప్రియుడితో కలిసి ట్రిప్‌ వెళ్లిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో మరమ్మతులు చేయించేందుకు ఇంటి యజమాని కూలీలను పంపించాడు. కూలీలు డ్రమ్మును కదిలించడానికి ప్రయత్నించగా అది చాలా బరువుగా ఉందని గమనించారు. దీంతో లోపల ఏముందని అడగగా, చెత్తాచెదారం ఉందని ముస్కాన్‌ చెప్పింది. అయితే మూత తీసి చూడగా అసహనకరమైన దుర్వాసన రావడంతో అనుమానాలతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మరింత భయానకంగా మారినది.

ఈ హత్యను గుర్తించడంలో సౌరభ్‌ ఆరేళ్ల కుమార్తె కీలకంగా మారింది. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని చిన్నారి పొరుగింటి వారికి పదేపదే చెప్పడం గమనించిన ముస్కాన్‌ తన కుమార్తెను వెంటనే వేరే చోటుకు పంపించేసింది. అయితే, ఇది ఆమె తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, చివరకు వాస్తవం బయటపడకుండా ఆపలేకపోయింది. ముస్కాన్‌ హత్య నిజం బయటకు వచ్చిన తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అన్ని వివరాలు చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.

తమ కూతురి నేరానికి తీవ్రంగా స్పందించిన ముస్కాన్‌ తల్లిదండ్రులు, నిందితురాలికి ఉరిశిక్ష విధించాలని కోరడం గమనార్హం. ఈ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును పరిశీలించిన పోలీసులు ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సౌరభ్‌ తల్లి రేణు దేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచి, అతని భవిష్యత్తును సాకారం చేసేందుకు పంపించామని, కానీ ఇలాంటి దారుణమైన హత్య జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య చేసిన తన కోడలు, ఆమె ప్రియుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

This post was last modified on March 20, 2025 1:11 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

5 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

7 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

7 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

9 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

12 hours ago