ఉత్తరప్రదేశ్లోని మేరఠ్లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ను అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టింది. ఈ అమానుష చర్య చివరకు ఓ చిన్నారి మాటలతో బయటపడింది.
సౌరభ్ హత్య అనంతరం ముస్కాన్ ప్రియుడితో కలిసి ట్రిప్ వెళ్లిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో మరమ్మతులు చేయించేందుకు ఇంటి యజమాని కూలీలను పంపించాడు. కూలీలు డ్రమ్మును కదిలించడానికి ప్రయత్నించగా అది చాలా బరువుగా ఉందని గమనించారు. దీంతో లోపల ఏముందని అడగగా, చెత్తాచెదారం ఉందని ముస్కాన్ చెప్పింది. అయితే మూత తీసి చూడగా అసహనకరమైన దుర్వాసన రావడంతో అనుమానాలతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మరింత భయానకంగా మారినది.
ఈ హత్యను గుర్తించడంలో సౌరభ్ ఆరేళ్ల కుమార్తె కీలకంగా మారింది. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని చిన్నారి పొరుగింటి వారికి పదేపదే చెప్పడం గమనించిన ముస్కాన్ తన కుమార్తెను వెంటనే వేరే చోటుకు పంపించేసింది. అయితే, ఇది ఆమె తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, చివరకు వాస్తవం బయటపడకుండా ఆపలేకపోయింది. ముస్కాన్ హత్య నిజం బయటకు వచ్చిన తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అన్ని వివరాలు చెప్పడంతో వారు షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.
తమ కూతురి నేరానికి తీవ్రంగా స్పందించిన ముస్కాన్ తల్లిదండ్రులు, నిందితురాలికి ఉరిశిక్ష విధించాలని కోరడం గమనార్హం. ఈ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును పరిశీలించిన పోలీసులు ముస్కాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సౌరభ్ తల్లి రేణు దేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచి, అతని భవిష్యత్తును సాకారం చేసేందుకు పంపించామని, కానీ ఇలాంటి దారుణమైన హత్య జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య చేసిన తన కోడలు, ఆమె ప్రియుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
This post was last modified on March 20, 2025 1:11 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…