Trends

చాహల్ ఆమెకిస్తోంది 4.75 కోట్లేనా?

ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ ధనశ్రీ అతడి నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటికి రాగానే ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని రోజుల కిందటే ధనశ్రీ కుటుంబం ఖండించింది. ఐతే వాస్తవానికి చాహల్ నుంచి ధనశ్రీ ఎంత మొత్తం భరణం రూపంలో తీసుకుంటున్నది ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. వీరికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భరణం గురించి కూడా ఆదేశాలు చేసినట్లు వెల్లడైంది. ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వాలని చాహల్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా చాహుల్ ఆల్రెడీ రూ.2.37 కోట్లు చెల్లించాడట. ఇదిలా ఉండగా విడాకులు మంజూరు చేస్తూనే.. దీనిపై పునరాలోచించుకునేందుకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను చాహల్, ధనశ్రీ జంటకు కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలాని చాహల్ కోరినట్లు సమాచారం. ఐతే ఇంకా పూర్తి భరణం చెల్లించని నేపథ్యంలో చాహల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందట. ఈ నేపథ్యంలో మొత్తం భరణం చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చాహల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on March 19, 2025 6:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

56 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago