Trends

చాహల్ ఆమెకిస్తోంది 4.75 కోట్లేనా?

ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ ధనశ్రీ అతడి నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటికి రాగానే ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని రోజుల కిందటే ధనశ్రీ కుటుంబం ఖండించింది. ఐతే వాస్తవానికి చాహల్ నుంచి ధనశ్రీ ఎంత మొత్తం భరణం రూపంలో తీసుకుంటున్నది ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. వీరికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భరణం గురించి కూడా ఆదేశాలు చేసినట్లు వెల్లడైంది. ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వాలని చాహల్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా చాహుల్ ఆల్రెడీ రూ.2.37 కోట్లు చెల్లించాడట. ఇదిలా ఉండగా విడాకులు మంజూరు చేస్తూనే.. దీనిపై పునరాలోచించుకునేందుకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను చాహల్, ధనశ్రీ జంటకు కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలాని చాహల్ కోరినట్లు సమాచారం. ఐతే ఇంకా పూర్తి భరణం చెల్లించని నేపథ్యంలో చాహల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందట. ఈ నేపథ్యంలో మొత్తం భరణం చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చాహల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on March 19, 2025 6:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

7 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

8 hours ago