Trends

చాహల్ ఆమెకిస్తోంది 4.75 కోట్లేనా?

ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ ధనశ్రీ అతడి నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటికి రాగానే ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని రోజుల కిందటే ధనశ్రీ కుటుంబం ఖండించింది. ఐతే వాస్తవానికి చాహల్ నుంచి ధనశ్రీ ఎంత మొత్తం భరణం రూపంలో తీసుకుంటున్నది ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. వీరికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భరణం గురించి కూడా ఆదేశాలు చేసినట్లు వెల్లడైంది. ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వాలని చాహల్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా చాహుల్ ఆల్రెడీ రూ.2.37 కోట్లు చెల్లించాడట. ఇదిలా ఉండగా విడాకులు మంజూరు చేస్తూనే.. దీనిపై పునరాలోచించుకునేందుకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను చాహల్, ధనశ్రీ జంటకు కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలాని చాహల్ కోరినట్లు సమాచారం. ఐతే ఇంకా పూర్తి భరణం చెల్లించని నేపథ్యంలో చాహల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందట. ఈ నేపథ్యంలో మొత్తం భరణం చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చాహల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on March 19, 2025 6:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

53 minutes ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

4 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

4 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago