Trends

రోహిత్ పై కాంగ్రెస్ నేత కామెంట్స్… BCCI కౌంటర్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు కేవలం అభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ బోర్డును కూడా తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఐసీసీ టోర్నీ మధ్యలో ఉన్న సమయంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు అవసరమా అని కౌంటర్లు వస్తున్నాయి.

ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని స్పష్టంగా అన్నారు. “ఈ తరహా వ్యక్తిగత విమర్శలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. జట్టు ఒక కీలక టోర్నీలో పోటీ పడుతున్న తరుణంలో, బాధ్యతాయుతమైన వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు రావడం అసహనకరం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో రోహిత్‌కి మద్దతుగా క్రికెట్ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

కానీ శమా మహమ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. “క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే నేను పోస్ట్ లో అలా రాశాను. ఇది బాడీ షేమింగ్ కాదు” అని వివరణ ఇచ్చారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచానికే కాదు, రాజకీయ వర్గాలకు కూడా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందిస్తూ, తమకు ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

ఇదంతా జరుగుతుండగా, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మరో సంచలన వ్యాఖ్య చేసి నూతన వివాదానికి తెరతీశారు. “రోహిత్ జట్టులో కూడా ఉండకూడదు” అంటూ ఆమె చేసిన కామెంట్స్ మద్దతుగా వ్యాఖ్యానించడంతో, ఈ వివాదం మరింత ముదిరింది. మొత్తానికి, ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా కాంగ్రెస్ కు కొంత డ్యామేజ్ తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ పార్టీ అధిష్టానం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

This post was last modified on March 3, 2025 4:56 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Rohit Sharma

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago