ప్రపంచంలో మరే దేశంలో ఉండని భిన్నత్వంలో ఏకత్వం భారత్ లోనే ఉంటుంది. నిజమే.. కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ మతసామరస్యంలో మాత్రం మనకు మించినోళ్లు లేరన్న భావన కలుగక మానదు. హిందూ.. ముస్లిం అంటూ బేధాభిప్రాయాలని క్రియేట్ చేసే వారికి భిన్నంగామతాలకు అతీతంగా ప్రేమాభిమానాలే ప్రాణవాయువులుగా తపించే వారు ఉంటారు. తాజాగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం ఉపాధి కోసం ముప్ఫై ఏళ్ల క్రితం హైదాబాద్ కు వెళ్లిపోయారు. ఆ మహానగరంలోని ఒక ఆసుపత్రితో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కానీ.. తన ఊళ్లో మాత్రం తరచూ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపడుతుండేవారు. అంతేనా.. ఊళ్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. అన్నీ తానై చూసుకొని.. వారిని ఆరోగ్య వంతులుగా చేసి ఊరికి పంపేవాడు.
ఇటీవల సలీంకు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో.. అతడి కోసం ఊళ్లోని హిందువులంతా అతనికి స్వస్థత చేకూరాలని.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో యజ్ఞం చేపట్టారు. తమ సలీంను కాపాడాలి భగవంతుడా అని వేడుకుంటున్నారు. ఇదంతా చదివిన తర్వాత అర్థమవుతుందా.. మన దేశం ప్రత్యేకత ఏమిటో?
This post was last modified on March 2, 2025 10:28 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…