చైనాలో కృత్రిమ మేధస్సు (AI) పోటీ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. టెన్సెంట్ తాజాగా విడుదల చేసిన హున్యూయాన్ టర్బో S మోడల్ దీన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ మోడల్ ప్రస్తుతానికి అత్యంత వేగంగా స్పందించగలిగే మోడల్గా టెన్సెంట్ ప్రకటించింది. ముఖ్యంగా డీప్సీక్ R1 వంటి మోడళ్లతో పోలిస్తే టర్బో S మరింత త్వరగా స్పందిస్తుందని కంపెనీ చెబుతోంది. గణితశాస్త్రం, లాజికల్ గా చెప్పడం వంటి విభాగాల్లో దీని పనితీరు డీప్సీక్ V3 మాదిరిగానే ఉందని టెన్సెంట్ తన ప్రకటనలో వెల్లడించింది.
చైనాలో డీప్సీక్ సంస్థ కృత్రిమ మేధస్సు విప్లవానికి ముఖ్య భూమిక పోషిస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన R1, V3 మోడళ్లు అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నుంచీ, ప్రపంచవ్యాప్తంగా ఈ మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో టెన్సెంట్, అలీబాబా వంటి పెద్ద టెక్నాలజీ సంస్థలు తమ మోడళ్లను మరింత మెరుగుపర్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ప్రభావంతో టెన్సెంట్, అలీబాబా వంటి సంస్థలు AI మోడళ్ల తయారీ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.
డీప్సీక్-వీ3 మోడల్ వాణిజ్యపరంగా విశేష విజయాన్ని అందుకోవడం, అంతర్జాతీయంగా ఓపెన్AI చాట్జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడం, ఇతర చైనా కంపెనీలకు మేలుకొలుపుగా మారింది. గత నెలలో డీప్సీక్-ఆర్1 విడుదలై AI పరిశ్రమలో గణనీయమైన మార్పులకు కారణం కాగా, వెంటనే అలీబాబా తన క్వెన్ 2.5-మ్యాక్స్ మోడల్ను ప్రకటించింది. ఈ మోడల్ డీప్సీక్-వీ3 కన్నా మెరుగ్గా పని చేస్తుందని అలీబాబా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో, టెన్సెంట్ తన కొత్త మోడల్ టర్బో S తో ఈ పోటీలోకి దిగింది. టర్బో ఎస్ నిమిషానికి తక్కువ ఖర్చుతో పని చేయగలిగే మోడల్ అని, డీప్సీక్ వ్యూహానికి తక్కువ ధరలతో పోటీ ఇవ్వడమే లక్ష్యం అని టెన్సెంట్ తెలిపింది. దీని ద్వారా వినియోగదారులపై ధర భారం తగ్గుతుందని, కొత్త AI వినియోగదారులను ఆకర్షించగలమని భావిస్తోంది.
AI రంగంలో చైనా సంస్థల పోటీ ముమ్మరంగా సాగుతోంది. డీప్సీక్ ఆర్1 ప్రభావంతో ఇతర AI కంపెనీలు తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన మోడళ్లను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. టెన్సెంట్ టర్బో ఎస్ మరింత వేగంగా స్పందించగలిగిన AI మోడల్గా నిలిచినా, దీని నిజమైన స్థాయి, దీర్ఘకాల ప్రయోజనాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక చైనాలో AI విప్లవం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.
This post was last modified on March 1, 2025 5:56 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…