ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు అయ్యారు. కార్మికులంతా మంచు కిందే కప్పబడిపోయారు.
ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే, ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంచు కింద కప్పబడిపోయిన ఓ 10 మంది కార్మికులను ఐటీబీపీ సిబ్బంది కాపాడారు. గాయాల పాలైన వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు.
అసలే దేశ సరిహద్దు ప్రాంతం… ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారి కావడంతో సహాయక చర్యలకు అంతగా అవకాశం లేకుండాపోయింది. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే చమోలి జిల్లా కలెక్టర్… సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రహదారిపై పడిపోయిన మంచును తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే కార్మికుల జాడ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
This post was last modified on February 28, 2025 3:23 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…