ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు అయ్యారు. కార్మికులంతా మంచు కిందే కప్పబడిపోయారు.
ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే, ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంచు కింద కప్పబడిపోయిన ఓ 10 మంది కార్మికులను ఐటీబీపీ సిబ్బంది కాపాడారు. గాయాల పాలైన వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు.
అసలే దేశ సరిహద్దు ప్రాంతం… ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారి కావడంతో సహాయక చర్యలకు అంతగా అవకాశం లేకుండాపోయింది. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే చమోలి జిల్లా కలెక్టర్… సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రహదారిపై పడిపోయిన మంచును తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే కార్మికుల జాడ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
హస్తకళా మహోత్సవం వేదికపై కళాకారులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను స్వయంగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరుసటి రోజే…
జూలై 10 విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రస్తుతానికి హృదయం మురళి తక్కువ సౌండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక…
ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా…
యాంకర్గా ప్రయాణం మొదలుపెట్టి నటిగా మంచి స్థాయికి చేరుకున్న తెలుగమ్మాయి స్వాతి మళ్లీ పెళ్లికూతురైంది. తొలి వివాహం విఫలమయ్యాక కొన్నేళ్లు…
ఏపీ ప్రతిపక్షం వైసీపీలో నాయకుల మధ్య కలివిడి ఎలా ఉన్నా.. వివాదాలకు మాత్రం కేంద్రంగా మారుతున్నారు. ఒకరిపై ఒకరికి పడడం…
సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో బోలెడన్ని అవకాశాలు అందుకుని.. చాలా ఏళ్ల పాటు ఇక్కడ కెరీర్ను నడిపించి.. బాగా…