Trends

అత్యంత ఎత్తైన రోడ్డుపై మంచు కింద చిక్కుకున్న 47 మంది

ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు అయ్యారు. కార్మికులంతా మంచు కిందే కప్పబడిపోయారు.

ఈ ప్రమాదం గురించి తెలిసినంతనే, ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంచు కింద కప్పబడిపోయిన ఓ 10 మంది కార్మికులను ఐటీబీపీ సిబ్బంది కాపాడారు. గాయాల పాలైన వీరిని హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన 47 మంది జాడ తెలియరాలేదు.

అసలే దేశ సరిహద్దు ప్రాంతం… ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రహదారి కావడంతో సహాయక చర్యలకు అంతగా అవకాశం లేకుండాపోయింది. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే చమోలి జిల్లా కలెక్టర్… సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. రహదారిపై పడిపోయిన మంచును తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అప్పుడే కార్మికుల జాడ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Satya

Recent Posts

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

56 seconds ago

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

48 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

8 hours ago