Trends

పిల్లల సాక్ష్యం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యాయపరంగా పిల్లల సాక్ష్యం ఎంత వరకు నమ్మదగినదో అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్య కేసులో ఏడేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యాన్ని న్యాయస్థానం ప్రామాణికంగా గుర్తించి, నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో ముద్దాయి తన భార్యను హత్య చేసినప్పుడు చిన్నారి అక్కడే ఉండగా, ఆమె చెప్పిన వివరాలను తొలుత హైకోర్టు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చిన్నారి వాఖ్యలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు తీర్పును రద్దు చేసింది.

సాక్ష్య చట్టంలో వయస్సుకు పరిమితి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని నేరుగా తిరస్కరించలేమని న్యాయమూర్తులు తెలిపారు. అయితే, పిల్లలు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, కోర్టులు అత్యంత జాగ్రత్తగా అటువంటి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారులు ఇతరుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు తగిన ఆధారాలు లేకుంటే వారి వాఖ్యాలను పూర్తిగా తిరస్కరించకూడదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

చిన్నారి ఇచ్చిన వాఖ్యాలు సహజమైనవా? లేక ఎదుటివారి ప్రభావం వల్ల చెప్పించబడ్డాయా? అనే అంశాన్ని కోర్టులు వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల సాక్ష్యం అంతుచిక్కని సమస్యగా మారితే, కోర్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యానికి తప్పనిసరిగా మరో వ్యక్తి మద్దతుగా ఉండాలని నిబంధన లేదని, కానీ అవసరమైన సందర్భాల్లో అదనపు రుజువులను పరిశీలించడం మంచిదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మొత్తానికి, పిల్లలు న్యాయపరంగా సాక్ష్యంగా నిలబడే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా సమర్థించింది. కానీ, కోర్టులు ఆ సాక్ష్యాన్ని అర్ధం చేసుకోవడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. చిన్నారులను ప్రభావితం చేయకుండా, వారి వాఖ్యాలు నిజాయితీగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు, భవిష్యత్‌లో చిన్నారుల సాక్ష్యంపై కోర్టుల వైఖరికి స్పష్టతనిస్తుంది.

This post was last modified on February 26, 2025 3:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

58 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago