బెంగళూరులో ఓ యువతి ఇంటి వద్ద జరిగిన ఆగడాలు అందరినీ షాక్కు గురి చేశాయి. శనివారం అర్ధరాత్రి తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబానికి చెందిన కార్లు, బైక్ తగలబెట్టిన ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. సౌత్ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాహుల్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. అతనిపై ఇప్పటికే హత్యాయత్నం, డ్రగ్ కేసులు సహా పది కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు, 2022లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతనిపై కాల్పులు కూడా కాల్చారు. ‘స్టార్’ రాహుల్ అని సుపరిచితుడైన ఈ వ్యక్తి తిరిగి మరో దారుణానికి పాల్పడ్డాడు.
సోమవారం తెల్లవారుజామున తన సహచరుడితో కలిసి బైక్ పై వచ్చిన రాహుల్, మొదట తన మాజీ ప్రేయసి తండ్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ కేకలు వేయడంతో పాటు యువతి తండ్రిని తిట్టాడు. ప్రేమలో ఉన్న తమరిని విడిపోయేలా చేసాడని నిందించాడు. అయితే, ఎవ్వరూ బయటకు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన రాహుల్, ఆ ఇంటి పార్కింగ్ లోపల ఉన్న బైక్ను తగలబెట్టాడు.
అక్కడి నుంచి బయటకు వచ్చిన అతను, వెంటనే ఆరేహళ్లి ప్రాంతంలో తన మాజీ ప్రేయసి తల్లి నివసించే అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ బేస్మెంట్లో ఉన్న కారును తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో వాహనం కూడా పూర్తిగా దెబ్బతింది. ఆ అగ్నికాండను ఆపే ప్రయత్నం చేసిన భద్రతా సిబ్బందిని రాహుల్ దాడి చేసి తప్పించుకున్నాడు.
ఈ ఘటనపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, రాహుల్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వేర్వేరు ప్రదేశాల్లో రాహుల్ చేసిన విధ్వంసం, ప్రేమోన్మాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. బెంగళూరులో ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on February 24, 2025 3:55 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…