బెంగళూరులో ఓ యువతి ఇంటి వద్ద జరిగిన ఆగడాలు అందరినీ షాక్కు గురి చేశాయి. శనివారం అర్ధరాత్రి తన మాజీ ప్రేయసి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబానికి చెందిన కార్లు, బైక్ తగలబెట్టిన ఘటన ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. సౌత్ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
రాహుల్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. అతనిపై ఇప్పటికే హత్యాయత్నం, డ్రగ్ కేసులు సహా పది కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు, 2022లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతనిపై కాల్పులు కూడా కాల్చారు. ‘స్టార్’ రాహుల్ అని సుపరిచితుడైన ఈ వ్యక్తి తిరిగి మరో దారుణానికి పాల్పడ్డాడు.
సోమవారం తెల్లవారుజామున తన సహచరుడితో కలిసి బైక్ పై వచ్చిన రాహుల్, మొదట తన మాజీ ప్రేయసి తండ్రి ఇంటికి వెళ్లాడు. అక్కడ కేకలు వేయడంతో పాటు యువతి తండ్రిని తిట్టాడు. ప్రేమలో ఉన్న తమరిని విడిపోయేలా చేసాడని నిందించాడు. అయితే, ఎవ్వరూ బయటకు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన రాహుల్, ఆ ఇంటి పార్కింగ్ లోపల ఉన్న బైక్ను తగలబెట్టాడు.
అక్కడి నుంచి బయటకు వచ్చిన అతను, వెంటనే ఆరేహళ్లి ప్రాంతంలో తన మాజీ ప్రేయసి తల్లి నివసించే అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ బేస్మెంట్లో ఉన్న కారును తగలబెట్టాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో వాహనం కూడా పూర్తిగా దెబ్బతింది. ఆ అగ్నికాండను ఆపే ప్రయత్నం చేసిన భద్రతా సిబ్బందిని రాహుల్ దాడి చేసి తప్పించుకున్నాడు.
ఈ ఘటనపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, రాహుల్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వేర్వేరు ప్రదేశాల్లో రాహుల్ చేసిన విధ్వంసం, ప్రేమోన్మాదం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. బెంగళూరులో ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on February 24, 2025 3:55 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…