కన్నప్ప వల్ల మంచు ఫ్యామిలీ, ప్రభాస్ మధ్య ఎంత స్నేహం ఉందో బయట ప్రపంచానికి తెలిసింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా డార్లింగ్ అందులో ఫ్రీగా క్యామియో చేయడం చూస్తే బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కన్నప్ప బిజినెస్ లో ప్రభాస్ పాత్ర కీలక పాత్ర పోషించబోవడం ఎవరూ కాదనలేరు.
ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్ కి ఇది చాలా కీలకం కానుంది. అయితే క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు వగైరా ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ బసవనా లేక ఇంకేదైనా సర్ప్రైజ్ ఉంటుందానేది ఇంకొంత కాలం వేచి చూడాలి.
ఇదిలా ఉండగా స్పిరిట్ కోసం ఇటీవలే క్యాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆడామగా అన్ని వయసుల వారు అప్లై చేసుకోవచ్చని, రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలు ఇతర వివరాలు పంపిస్తే ఆడిషన్ కి ఎంపిక చేస్తామని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇప్పటికే కొన్ని వేలు లక్షల మెయిల్స్ వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడీ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. మంచు విష్ణు అఫీషియల్ గా దీని గురించి చెబుతూ నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నానని, చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ది రాజా సాబ్, ఫౌజీ పూర్తయ్యాక దీని సెట్లలో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నాడు. వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ఇప్పటిదాకా ఎవరూ చూపించని యాంగిల్ లో ఖాకీ పవర్ ని ఇందులో ఆవిష్కరిస్తారట.
అయినా మంచు విష్ణు నేరుగా అడిగినా అవకాశం వచ్చేస్తుంది కానీ అక్కడ ఉన్నది వంగా కాబట్టి ప్రతిదీ ప్రక్రియని బట్టి జరగాలేమో. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న స్పిరిట్ కి ఇంకా హీరోయిన్ ని లాక్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ వంగా ఎంపిక మీద కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు.
This post was last modified on February 15, 2025 3:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…