కన్నప్ప వల్ల మంచు ఫ్యామిలీ, ప్రభాస్ మధ్య ఎంత స్నేహం ఉందో బయట ప్రపంచానికి తెలిసింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా డార్లింగ్ అందులో ఫ్రీగా క్యామియో చేయడం చూస్తే బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కన్నప్ప బిజినెస్ లో ప్రభాస్ పాత్ర కీలక పాత్ర పోషించబోవడం ఎవరూ కాదనలేరు.
ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్ కి ఇది చాలా కీలకం కానుంది. అయితే క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు వగైరా ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ బసవనా లేక ఇంకేదైనా సర్ప్రైజ్ ఉంటుందానేది ఇంకొంత కాలం వేచి చూడాలి.
ఇదిలా ఉండగా స్పిరిట్ కోసం ఇటీవలే క్యాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆడామగా అన్ని వయసుల వారు అప్లై చేసుకోవచ్చని, రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలు ఇతర వివరాలు పంపిస్తే ఆడిషన్ కి ఎంపిక చేస్తామని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇప్పటికే కొన్ని వేలు లక్షల మెయిల్స్ వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడీ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. మంచు విష్ణు అఫీషియల్ గా దీని గురించి చెబుతూ నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నానని, చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ది రాజా సాబ్, ఫౌజీ పూర్తయ్యాక దీని సెట్లలో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నాడు. వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ఇప్పటిదాకా ఎవరూ చూపించని యాంగిల్ లో ఖాకీ పవర్ ని ఇందులో ఆవిష్కరిస్తారట.
అయినా మంచు విష్ణు నేరుగా అడిగినా అవకాశం వచ్చేస్తుంది కానీ అక్కడ ఉన్నది వంగా కాబట్టి ప్రతిదీ ప్రక్రియని బట్టి జరగాలేమో. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న స్పిరిట్ కి ఇంకా హీరోయిన్ ని లాక్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ వంగా ఎంపిక మీద కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…