ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే ‘పందెం కోళ్లు’ గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ పందేలు కామన్. ఇక, తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే పందేలకు తిరుగులేదు. ఈ ఏడాది అయితే.. ఊరూ వాడా విచ్చలవిడిగా చెలరేగి మరీ పందేలు కాశారు. సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు కోడి పందేల్లో సొమ్ములు పారినట్టు సమాచారం. ఇక, ఇప్పుడు ఈ గోదావరి సంస్కృతి రెక్కలు కట్టుకుని హైదరాబాద్కు వాలిపోయింది.
తాజాగా హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్టు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అదేసమయంలో వైసీపీ హయాంలో గుడివాడకు పరిమితమైన క్యాసినో జూదం కూడా హైదరాబాద్ కు చేరిపోయింది. ఈ వ్యవహారంపై ఉప్పందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సదరు ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని అరెస్టు చేశారు. కోడి పందేలు, క్యాసినో కోసం సిద్ధం చేసిన 30 లక్షల రూపాయల నగదును సీజ్ చేయడంతోపాటు 55 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, ఫామ్ హౌస్లో ఉన్న 86 పందెం కోళ్ళను కూడా పోలీసులు స్టేషన్కు తరలించారు. వీటిని గోదావరి జిల్లాల నుంచి తరలించినట్టు తెలిపారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే.. పందెం కోళ్లకు కట్టేందుకు తీసుకువచ్చిన 46 విదేశీ కోడి కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులను ఆహ్వానించి.. ఈ కోడిపందేలు క్యాసినో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈయనపై గతంలోనూ కేసు నమోదైందని తెలిపారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…