ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే ‘పందెం కోళ్లు’ గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ పందేలు కామన్. ఇక, తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చిందంటే పందేలకు తిరుగులేదు. ఈ ఏడాది అయితే.. ఊరూ వాడా విచ్చలవిడిగా చెలరేగి మరీ పందేలు కాశారు. సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు కోడి పందేల్లో సొమ్ములు పారినట్టు సమాచారం. ఇక, ఇప్పుడు ఈ గోదావరి సంస్కృతి రెక్కలు కట్టుకుని హైదరాబాద్కు వాలిపోయింది.
తాజాగా హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్లో కోడి పందేలు నిర్వహిస్తున్నట్టు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అదేసమయంలో వైసీపీ హయాంలో గుడివాడకు పరిమితమైన క్యాసినో జూదం కూడా హైదరాబాద్ కు చేరిపోయింది. ఈ వ్యవహారంపై ఉప్పందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సదరు ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని అరెస్టు చేశారు. కోడి పందేలు, క్యాసినో కోసం సిద్ధం చేసిన 30 లక్షల రూపాయల నగదును సీజ్ చేయడంతోపాటు 55 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక, ఫామ్ హౌస్లో ఉన్న 86 పందెం కోళ్ళను కూడా పోలీసులు స్టేషన్కు తరలించారు. వీటిని గోదావరి జిల్లాల నుంచి తరలించినట్టు తెలిపారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే.. పందెం కోళ్లకు కట్టేందుకు తీసుకువచ్చిన 46 విదేశీ కోడి కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులను ఆహ్వానించి.. ఈ కోడిపందేలు క్యాసినో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈయనపై గతంలోనూ కేసు నమోదైందని తెలిపారు.
This post was last modified on February 12, 2025 6:21 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…